logo

మహాత్ముని కలలను నిజం చేద్దాం: మంత్రి

మహాత్మాగాంధీ కలలను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పలాస-కాశీబుగ్గ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం

Published : 15 Aug 2022 06:29 IST

సెల్ఫీ స్టాండ్‌ వద్ద మంత్రి అప్పలరాజు దంపతులు

పలాస, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ కలలను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పలాస-కాశీబుగ్గ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పలాస జూనియర్‌ కళాశాల నుంచి కాశీబుగ్గ కె.టి.రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం వరకు 300 అడుగుల జాతీయ జెండా పట్టుకుని నడిచారు. అనంతరం బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్‌లో ఫొటోలు దిగారు. పురపాలక సంఘ అధ్యక్షుడు బళ్ల గిరిబాబు, ఉపాధ్యక్షులు బి.కృష్ణారావు, ఎం.సురేష్‌బాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ డి.భవానీశంకర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పి.వి.సతీష్‌, మందస ఎంపీపీ డి.దానయ్య, ఆర్డీఓ సీతారామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని