logo

రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్‌ దుర్మరణం

జాతీయ రహదారిపై లావేరు మండలం బొంతుపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం బుద్ధగయా జిల్లాకు

Published : 15 Aug 2022 06:29 IST

లావేరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై లావేరు మండలం బొంతుపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం బుద్ధగయా జిల్లాకు చెందిన చంద్రయాదవ్‌(30) లారీ డ్రైవర్‌ లోడుతో కలకత్తా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బొంతుపేట కూడలి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ముందు బాగం నుజ్జునుజ్జయింది. విషయాన్ని చంద్రయాదవ్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు సోమవారం వస్తారని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌.ఐ. ఎ.కోటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని