లోకాన్ని వదిలి... శోకాన్ని మిగిల్చి..!
వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు ప్రాణాలు కోల్పోయారు. అయిన వారందరినీ వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
వేర్వేరు ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు మృతి
వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో అయిదుగురు జిల్లావాసులు ప్రాణాలు కోల్పోయారు. అయిన వారందరినీ వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. బలవన్మరణానికి పాల్పడి ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు, పాముకాటుకు గురై ఒకరు, ఛాతీలో నొప్పితో ఓ యువకుడు మృతి చెందారు. ఆయా కుటుంబాల్లో తీరన్ని శోకాన్ని మిగిల్చారు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.
పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా...
లట్టిగాం(నందిగాం), న్యూస్టుడే: నందిగాం మండలంలోని కాపుతెంబూరు పంచాయతీ లట్టిగాం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణమూర్తి(70) పొలంపనులు చూసుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో టెక్కలి నుంచి పలాసవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వడ్డి రామోజీరావు ఈయన బలంగా ఢీకొట్టారు. ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపంచనామాకు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఏస్ఐ మహమ్మద్ అమీర్అలీ చెప్పారు. కృష్ణమూర్తి భార్య మృతి చెందారు. కుమార్తెకు వివాహం కావడం, కుమారులు ఇద్దరు ఉద్యోగరీత్యా వేర్వేరు చోట్ల ఉన్నారు. ప్రస్తుతం కృష్ణమూర్తి ఒక్కరే ఉంటున్నారు.
ప్రాణం తీసిన అప్పుల భారం
సారవకోట, న్యూస్టుడే: అప్పుల బాధ తాళలేక ఓ ఇంటిపెద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సారవకోట మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ బి.లావణ్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చీడిపూడి కాలనీకి చెందిన సుగుంద శ్రీనివాసరావు(40) కర్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు మూడునెలల కిందట శ్రీనివాసరావు వివాహం చేశారు. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈయన మృతితో కుటుంబమంతా వీధినపడిందని స్థానికులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ