logo

బాలుడిపై అత్యాచారం!

పోలాకి మండలంలోని రాళ్లగోదాయవలస గ్రామంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పి.అమావాస్య సోమవారం అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఏఎస్‌ఐ చిరంజీవరావు తెలిపారు.

Published : 17 Aug 2022 06:43 IST

పోలాకి, న్యూస్‌టుడే: పోలాకి మండలంలోని రాళ్లగోదాయవలస గ్రామంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పి.అమావాస్య సోమవారం అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఏఎస్‌ఐ చిరంజీవరావు తెలిపారు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన అమావాస్య బాలుడిని తిట్టి అత్యాచారం చేసినట్లు చెప్పారు. ఈ విషయమై బాలుడి కుటుంబసభ్యులు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. డీఎస్పీ బాలరాజు గ్రామానికి వెళ్లి దీనిపై విచారణ జరిపారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని