Srikakulam: పోలీసులమని చెప్పి దోచేశారు..!
మంచిగా మాట్లాడారు.. జాగ్రత్తలు చెప్పారు. పోలీసులమని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాయలో పడి నిలువునా మోసపోయింది పాపం వృద్ధురాలు.. ఒకటి కాదు, రెండు కాదు 13 తులాల బంగారు ఆభరణాలు
వృద్ధురాలి నుంచి 13 తులాల బంగారం అపహరణ
రెండో పట్టణ పోలీసు స్టేషన్ వద్ద బాధితురాలు నిర్మలకుమారి
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: మంచిగా మాట్లాడారు.. జాగ్రత్తలు చెప్పారు. పోలీసులమని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాయలో పడి నిలువునా మోసపోయింది పాపం వృద్ధురాలు.. ఒకటి కాదు, రెండు కాదు 13 తులాల బంగారు ఆభరణాలు ఆమె నుంచి అపహరించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన పి.నిర్మలకుమారి అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయించాలని సూచించడంతో సమీపంలోని ల్యాబ్కు వెళ్లి రక్తం ఇచ్చింది. అక్కడి నుంచి డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న గణపతి ఆలయానికి వెళ్లింది. దర్శనానంతరం తిరిగి ఆసుపత్రికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను పిలిచారు. ‘అమ్మా.. మెడలో.. చేతికి ఇంత బంగారం వేసుకుని తిరగొద్దు. వెంటనే తీసేసి బ్యాగులో వేసుకోండి.’ అని చెప్పారు. ఆమె వారి మాటలను నమ్మి బంగారాన్ని వారి చేతికిచ్చి బ్యాగులో వేయాలని కోరింది. వేశామని వృద్ధురాలిని నమ్మించిన వారు ఆమెను అక్కడ నుంచి పంపించేశారు. కొంత దూరం వెళ్లాక ఆమె బ్యాగులో చూడగా బంగారం లేదు. స్థానికుల సాయంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. వృద్ధురాలి చేతికి వేసుకున్న 8 బంగారం గాజులు, పుస్తెలతాడు, నల్లపూసలు అపహరించుకుపోయారని, వాటి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని సీఐ ఈశ్వరప్రసాద్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్