logo

చంద్రబాబును సీఎం చేసేవరకూ విశ్రమించొద్దు

చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలు విశ్రమించకూడదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఇటీవల నియమితులైన కాపు, శిష్టకరణ, దేవాంగ, విశ్వబ్రాహ్మణ

Published : 27 Sep 2022 06:27 IST

అచ్చెన్నాయుడును సత్కరిస్తున్న రాష్ట్ర సాధికారత కమిటీ డైరెక్టర్లు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలు విశ్రమించకూడదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఇటీవల నియమితులైన కాపు, శిష్టకరణ, దేవాంగ, విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ డైరెక్టర్లు పాండ్రంకి శంకర్‌, గుత్తు చిన్నారావు, పట్నాయకుని మధుసూదనరావు, పట్నాల పార్వతీశం తదితరులు సోమవారం నిమ్మాడలోని ఇంటికి వెళ్లి ఆయన్ని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సాధికార కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన వారంతా తెదేపా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో అన్నింటా విఫలమైందనేది వివరించాలన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, జిల్లా అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రధాన విజయరాం, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని