రారండోయ్.. అమ్మ జాతర చూసొద్దాం
కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా.. కోటబొమ్మాళి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొత్తమ్మతల్లి జాతర వచ్చేసింది.. మూడురోజుల పాటు ఉత్సవ శోభతో అలరారనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
నేటి నుంచి కొత్తమ్మతల్లి ఉత్సవాలు
విద్యుద్దీపాలంకరణలో ఆలయ గోపురం, (అంతర చిత్రంలో)అమ్మవారు
న్యూస్టుడే, కోటబొమ్మాళి : కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా.. కోటబొమ్మాళి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొత్తమ్మతల్లి జాతర వచ్చేసింది.. మూడురోజుల పాటు ఉత్సవ శోభతో అలరారనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతంలో 1925లో అదృశ్యమైన ఓ ముత్తయిదువ గ్రామాన్ని రక్షించేందుకు కొత్తమ్మతల్లిగా వెలిసిందని గ్రామస్థులు చెబుతుంటారు. నాటి నుంచి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా మారింది. ఏటా పోలాల అమావాస్య తర్వాత వచ్చే గురువారం అమ్మవారి జాతరకు ఆఖరిరోజుగా పరిగణించి పండగ నిర్వహిస్తుంటారు. మంగళవారం నుంచి 29 (గురువారం) వరకు ఉత్సవాలు జరగనున్నాయి. జాతర సందర్భంగా విశాఖపట్నానికి చెందిన పెద్దబాబు సహకారంతో రప్పించిన పూలతో గర్భగుడి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
సమీప ప్రాంతాల భక్తుల దర్శనం..
ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం ముందుగా దేవదాయశాఖ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయం నుంచి జంగిడి బయలుదేరి కమ్మకట్టు చినఅప్పలనాయుడు ఇంటికి వెళ్తుంది. మూడు రోజులపాటు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు తీసుకువచ్చిన ముర్రాటలను గర్భగుడిలో పూజారుల చేతులమీదుగా అమ్మవారికి సమర్పిస్తారు. గురువారం మధ్యాహ్నం తర్వాత గ్రామంలోని ప్రతీ వీధి నుంచి ఘటాలు బయలుదేరి మేళతాళాలు, డప్పుల మోతల మధ్య జంగిడితో ఆలయానికి చేరుకుంటాయి. మూడు రోజులూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలకు 406 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు సడలించడంతో ఎక్కువమంది భక్తులు హారవుతారని అంచనా. పోలీసులు, ఇతర శాఖల సహకారంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్ల ఇన్ఛార్జి ఈవోసూర్యనారాయణ తెలిపారు
ఇదీ చరిత్ర... కోటబొమ్మాళి గ్రామానికి చెందిన కమ్మకట్టు చినఅప్పలనాయుడు ప్రతి గురువారం నేరేడివలస(నారాయణవలస) వారపు సంతలో క్రయవిక్రయాలకు ఎడ్లబండిపై రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో ఓసారి తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఓ ముత్తయిదువ ఆపి కోటబొమ్మాళి వరకు వస్తానని చెప్పి బండి ఎక్కింది. గ్రామానికి ముందు పట్నాయకుని వెంకటేశ్వరరావు మామిడితోట వద్ద నిర్మానుష్య ప్రాంతంలో దిగి అదృశ్యమైంది. అదే రోజు చిన్నఅప్పలనాయుడు కలలో కనిపించి బండి దిగిన ప్రాంతంలోనే కొత్తమ్మ తల్లిగా వెలిశానని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల