ఫిర్యాదు చేస్తే ఆక్రమణలపై చర్యలు
జిల్లాలో జలవనరుల్లో ఆక్రమణలు దారుణంగా పెరిగిపోయాయి. 8 వేల చెరువులుంటే వాటిలో 4 వేల మేర గత కొన్నేళ్లుగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. అలా చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం’
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం
జిల్లాలో జలవనరుల్లో ఆక్రమణలు దారుణంగా పెరిగిపోయాయి. 8 వేల చెరువులుంటే వాటిలో 4 వేల మేర గత కొన్నేళ్లుగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. అలా చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం’ అని నీటి పారుదల శాఖ ఎస్ఈ సుధాకరరావు స్పష్టం చేశారు. పాత ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దాన్ని అమలు చేస్తామంటున్న ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ప్రశ్న: శివారు ప్రాంతాలకు ఇంకా నీరందని పరిస్థితి. ఎప్పుడు ఇస్తారు.?
ఎస్ఈ : నారాయణపురం ఆనకట్ట పరిధిలోని శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరు అందించలేకపోతున్నాం. ప్రస్తుతానికి నాకాబందీ పద్ధతిలో ఒక్కో ప్రాంతానికీ నీరు ఇస్తున్నాం. విడతల వారీగా అన్ని గ్రామాలకూ సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. పొన్నాడ కాలువకు నాలుగు రోజులు ఇచ్చి ఇప్పుడు, కొంగరాం, భగీరథపురం తదితర గ్రామాలకు విడుదల చేశాం. ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకరాకూ నీరందించేందుకు కృషి చేస్తున్నాం.
మడ్డువలస ఫేజ్-2 పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది?
మడ్డువలస విస్తరణలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి ఫేజ్-2 కింద చేసేందుకు రూ.26 కోట్లకు అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. మూడోసారి పిలిచాం. నిర్ణీత సమయం తర్వాత తెరుస్తాం. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు అప్పగించి పనులు చేయిస్తాం.
పొలాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి, పరిష్కారం చూపుతారా?
* జిల్లాలో ఇది అతిపెద్ద సమస్యగా మారింది. తక్షణం నాగావళి, వంశధార నదులపై కొన్నిచోట్ల అత్యవసరంగా రక్షణ గోడలు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఈ రక్షణ గోడల నిర్మాణానికి నాగావళి నదికి రూ.37.5 కోట్లు, వంశధార నదికి భూసేకరణతో కలిపి రూ.130 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అవి ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస పరిధిలో కలెక్టర్ కేటాయించిన నిధులతో పనులు చేస్తున్నాం.
జైకా నిధులతో చేపట్టిన పనుల సంగతేంటి?
* జైకా నిధులతో నారాయణపురం ఆనకట్ట, కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాం. సాగునీరు విడిచిపెట్టక ముందు వరకూ పనులు ముమ్మరంగా జరిగాయి. తర్వాత ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పనులు జరగడం లేదు. ఇప్పటివరకూ చేసినవాటికి రెండు ప్యాకేజీలకు మొత్తం రూ.18 కోట్ల బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ఈ సీజన్లోగా బిల్లులు విడుదలవుతాయని ఆశిస్తున్నాం.
అభివృద్ధి ప్రక్రియ మూలకు చేరినట్లేనా..?
* జిల్లాలో మొత్తం ఎనిమిది ప్యాకేజీల కింద చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాం. రెండేళ్ల కిందట వరకూ 50 శాతం పనులు పూర్తిచేశాం. వాటికి సంబంధించిన కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే బిల్లులు విడుదలవుతాయని చెప్పారు. మిగిలిన వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయిస్తాం. తద్వారా చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.
చెరువులు పూర్తిస్థాయిలో నింపలేకపోతున్నారు..?
* జిల్లాలో కేవలం 2 వేల చెరువులు మాత్రమే ప్రాజెక్టులు, కాలువలకు అనుసంధానంలో ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పటికే నింపాం. వర్షాధారంగా ఉన్నవాటిలో దాదాపు 80 శాతానికి పైగా నిండాయి. వచ్చే నెలలో పూర్తిగా నిండే అవకాశముంది. ఆయా చెరువులకు సంబంధించిన కాలువల్లో నీటి మళ్లింపునకు ఆటంకం లేకుండా పూడికలు తీయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM