Thief: 200కు పైగా ఇళ్లలో చోరీలు చేసిన దొంగ మళ్లీ వచ్చాడు!
ఆ ప్రబుద్ధుడు సుమారు 200కుపైగా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. చోరీలకు పాల్పడటం, పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లి శిక్ష అనుభవించడం, మళ్లీ ఇంటికి రావడం ఆయనకు అలవాటు. ఆ ఘనుడు మళ్లీ జిల్లాలోకి వచ్చినట్లు తెలియడంతో
సీసీ టీవీ ఫుటేజీలో లభ్యమైన నిందితుడి చిత్రం
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: ఆ ప్రబుద్ధుడు సుమారు 200కుపైగా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. చోరీలకు పాల్పడటం, పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లి శిక్ష అనుభవించడం, మళ్లీ ఇంటికి రావడం ఆయనకు అలవాటు. ఆ ఘనుడు మళ్లీ జిల్లాలోకి వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన దున్నకృష్ణ అలియాస్ రాజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరంలోనూ 5 ఇళ్లల్లో చోరీలు చేశాడు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుల్లోనూ పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.
మూడు రోజుల కిందట శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా కొన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దున్నకృష్ణ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఫొటోలతో కూడిన కరపత్రాలను వివిధ వాట్సాప్ గ్రూప్ల్లో పెట్టారు. అప్రమత్తంగా ఉండాలని, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని కోరారు. ఈ విషయమై డీఎస్పీ ఎం.మహేంద్ర మాట్లాడుతూ ‘నగరంలో దొంగతనాలు జరుగుతున్నందున గస్తీ పెంచాం. రాత్రిపూట అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నాం. దున్నకృష్ణను త్వరలోనే పట్టుకుంటాం. ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎల్హెచ్ఎంఎస్ విధానాన్ని వినియోగించుకోవాలి.’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు