జలాలు ఊరిస్తూనె ఉన్నాయ్
ఉద్దానం వాసులకు వచ్చే వేసవికైనా వంశధార జలాలు అందుతాయా అంటే.. పనుల తీరు చూస్తే అనుమానమే వ్యక్తం చేయాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ ఆగస్టు నాటికే నీటిని అందించాల్సి ఉంది.
నత్తనడకన ఉద్దానం మెగా తాగునీటి పథకం పనులు
తప్పని ఎదురుచూపులు
న్యూస్టుడే, సోంపేట: ఉద్దానం వాసులకు వచ్చే వేసవికైనా వంశధార జలాలు అందుతాయా అంటే.. పనుల తీరు చూస్తే అనుమానమే వ్యక్తం చేయాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ ఆగస్టు నాటికే నీటిని అందించాల్సి ఉంది. మెగా తాగునీటి పథకం పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో గడువు పొడిగించాల్సి వచ్చింది. దీంతో కిడ్నీవ్యాధుల నుంచి బారిన పడకుండా ఉండాలనుకుంటున్న ఉద్దానాన్ని ఉపరితల జలాలు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి.
నీరే ప్రాథమిక కారణం..
ఉద్దానం కిడ్నీ సమస్యలకు ఇక్కడ వినియోగించే నీరే ప్రాథమిక కారణమని పలు అధ్యయనాల్లో తేలడంతో ప్రభుత్వం వంశధార జలాలు తరలించేందుకు మెగా తాగునీటి పథకాన్ని చేపట్టింది. ఏడు మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురంలతో పాటు మెళియాపుట్టిలో కొన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. గొట్టాబ్యారేజి నుంచి నీటిని సేకరించి మెళియాపుట్టి వద్ద శుద్ధిపరిచి అక్కడ నుంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పంపిస్తారు. గ్రామాల్లోని ట్యాంకుల ద్వారా వచ్చి అనంతరం ఇంటింటా కుళాయిలకు నీటి సరఫరా అవుతుంది.
మార్చి నాటికి అందిస్తాం..
మార్చి 2023 నాటికి ఉద్దానం గ్రామాలకు నీళ్లిచ్చేలా చర్యలు చేపడుతున్నాం. భారీవర్షాల కారణంగా పనులు కొంతమేర ఆలస్యమయ్యాయి. డిసెంబరు నాటికి పనులు పూర్తయితే అక్కడ నుంచి మూడు నెలల పాటు నిర్వహణ పరమైన అంశాలు చూసి అనంతరం గ్రామాలకు నీటిసరఫరా జరుగుతుంది. ఇప్పటివరకు 70 శాతానికి పైగానే పనులు పూర్తయ్యాయి. ఇంటింటా కుళాయి పనులు జల్జీవన్ మిషన్ ద్వారా జరుగుతాయి. - టి.ఎస్.ప్రసాద్, ఎస్ఈ, గ్రామీణ నీటి సరఫరా
ఇదీ తీరు..
* గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు నేరుగా 140.42 కి.మీ పొడవునా ప్రధాన పైపులైను నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 80 కి.మీ. వరకు పనులు జరిగాయి. కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల పరిధిలో స్థల వివాదాలు, మిగిలిన మండలాల పరిధిలో భారీ వర్షాలతో ఇబ్బందుల మూలంగా పనులు ఆలస్యమవుతున్నాయి.
* పైపులైను వేసిన చోట కూడా అనుసంధాన పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* అనంతగిరి, కేదారిపురం, మామిడిమెట్టు, రఘునాథపురం, పాలవలస, సోంపేట, బలియాపుట్టి, జలంత్రకోట, సహలాలపుట్టుగ, ఇచ్ఛాపురం క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వకు ఆరు గ్రౌండులెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, మరో ఆరు ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది.
* క్లస్టర్ ప్రాంతం నుంచి గ్రామాలకు నీటి సరఫరాకు 866.08 కి.మీ.ల మేర అంతర్గత పైపులైను నిర్మాణం జరగాల్సి ఉంది. సహలాలపుట్టుగ క్లస్టర్లో 70 కి.మీ., బలియాపుట్టుగలో 35 కి.మీ., జలంత్రకోటలో 25 కి.మీ., సోంపేటలో 20 కి.మీ., ఇచ్ఛాపురంలో 25 కి.మీ. మేర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 466 కి.మీ. పనులు పూర్తయ్యాయి.
* గ్రామాలకు నీటి సరఫరాకు 807 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు అవసరం కాగా గతంలో నిర్మించిన కొన్ని ట్యాంకులను వినియోగిస్తూ, కొత్తగా మరో 571 ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో 70 శాతానికిపైగా వివిధ దశల్లో ఉన్నాయి.
మెళియాపుట్టి వద్ద నిర్మాణంలో ఉన్న మెగా తాగునీటి పథకం నీటిశుద్ధి ప్రధాన ట్యాంకు ఇది. దీనిని ప్రారంభించి ఇప్పటికి రెండేళ్లయింది. అధికారులు మాత్రం ఇక్కడ 70 శాతం పనులు జరిగినట్టు చెబుతున్నా ఈ మేరకు కన్పించడంలేదు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామంటున్నారు. పనులిలా జరిగితే అది సాధ్యమా అన్నదే ప్రశ్న. - న్యూస్టుడే, మెళియాపుట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ