ఈ-క్రాప్ ధ్రువీకరణలో వెనుకబాటు
పలాస మండలంలో మొత్తం 11,213 మంది రైతులు 12,992 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇప్పటివరకూ గ్రామ వ్యవసాయ సహాయకులు 8,420 ఎకరాలకు ఈ క్రాప్ చేశారు. ఇందులో కేవలం 271 ఎకరాలకు సంబంధించిన 175 మంది రైతులకు మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా 11,038 మంది ఈ-కేవైసీ పెండింగులో ఉంది.
నేటితో ముగియనున్న గడువు
పలాస మండలంలో మొత్తం 11,213 మంది రైతులు 12,992 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇప్పటివరకూ గ్రామ వ్యవసాయ సహాయకులు 8,420 ఎకరాలకు ఈ క్రాప్ చేశారు. ఇందులో కేవలం 271 ఎకరాలకు సంబంధించిన 175 మంది రైతులకు మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా 11,038 మంది ఈ-కేవైసీ పెండింగులో ఉంది.
ఈ-క్రాప్ ధ్రువీకరణలో కంచిలి: గోకర్ణపురంలో రైతులతో ఈ-కేవైసీ చేయిస్తున్న సిబ్బంది
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: అన్నదాతలకు విత్తనాల నుంచి పంట అమ్మకం వరకూ అన్నిటికీ ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదుతో ముడిపెట్టింది. ఇందుకు గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారికి జాయింట్ అజమాయిషీ ఇచ్చారు. వీరి ధ్రువీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. కానీ అథెంటికేషన్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. గడువు పొడిగిస్తారా అనే దానిపైనా స్పష్టతలేదు. వీఏఏ తర్వాత వీఆర్వో ధ్రువీకరణ పూర్తయితేనే ఈక్రాప్ బుకింగ్ పూర్తిస్థాయిలో జరిగినట్లు లెక్క. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బంది మెరుపు వేగంతో పనిచేయాల్సి ఉంది.
తప్పని జాప్యం
జిల్లా మొత్తం మీద 3.75 లక్షల మంది రైతులు పంటలు సాగుచేస్తున్నారు. వీరందరికీ ఈకేవైసీ పూర్తిచేయాలి. ఆయా పంటలు సాగు చేస్తున్నది తామేనని చెప్పుకోవడమే దీని ఉద్దేశం. దీనికి ఈనెల 10 వరకూ సమయం ఉన్నా... ఇప్పటివరకు 2.5 శాతమే ఈకేవైసీ పూర్తయింది. ఈక్రాప్ జరిగినా ఈకేవైసీ పూర్తికాకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవు.
వెనుకబడిన మండలాలు ఇలా...
వీఏఏ ధ్రువీకరణలో జలుమూరు, పలాస, జి.సిగడాం, పాతపట్నం, నందిగాం, కొత్తూరు, టెక్కలి, హిరమండలం, కోటబొమ్మాళి, రణస్థలం మండలాలు వెనుకబడ్డాయి. ఇవన్నీ 80 శాతం లోపే ఉన్నాయి. జలుమూరు, పలాస, జీ.సిగడాం మండలాలయితే 70 శాతం కూడా దాటలేదు. వీఆర్వో ధ్రువీకరణ అత్యల్పంగా కొత్తూరులో 26 శాతం, లావేరు 34 శాతం, జలుమూరు 38, పలాస 38, జి.సిగడాం 39 శాతం మేరకే పూర్తయింది.
నమోదుపై సామాజిక తనిఖీ
కొందరు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటను చూసి ఈక్రాప్ బుకింగ్ చేశారు. ఇంకొందరు మాత్రం కార్యాలయాల్లోనే కూర్చుని బుకింగ్లు పూర్తిచేశారు. దీనివల్ల కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ఏ రైతు ఏ పంట వేసినట్లు ఈక్రాప్లో బుక్ చేశారు అనే అంశాన్ని రైతులే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈనెల 11 నుంచి గ్రామ సచివాలయాల్లో లేదా ఆర్బీకేల్లో ఈ వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడి నుంచి ఏడు రోజుల పాటు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తారు. తుది జాబితాను అక్టోబరు 31న ప్రదర్శిస్తారు.
లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం
- కె.శ్రీధర్, జేడీఏ
సర్వర్ సమస్యల వల్ల జాప్యం జరుగుతోంది. సెప్టెంబరు 30 అర్ధరాత్రితో ఈక్రాప్ గడువు ముగిసింది. వీఏఏ, వీఆర్వో ధ్రువీకరణ సోమవారంతో ముగుస్తుంది. నమోదు చేసేది సిబ్బందే కాబట్టి ధ్రువీకరణకు ఎక్కువ సమయం పట్టదు. ఆ తర్వాత రైతుల ఈ-కేవైసీ పునఃప్రారంభిస్తాం. మధ్యలో కొన్ని రోజులు సర్వర్ సమస్య వల్ల నెమ్మదించింది. నేటి నుంచి వేగంగా జరుగుతుంది. గడువులోగా పూర్తిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా