పరీక్ష రాసేద్దాం.. ప్రతిభ చూపిద్దాం..!
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశించిన కౌశల్ ప్రతిభాన్వేషణకు పోటీలకు ప్రకటన వెలువడింది. రాష్ట్ర సాంకేతిక సలహా మండలి(ఆప్కాస్ట్), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా పోటీలను నిర్వహించనున్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
‘కౌశల్’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)
గోడపత్రికను విడుదల చేస్తున్న డీఈవో జి.పగడాలమ్మ, తదితరులు
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశించిన కౌశల్ ప్రతిభాన్వేషణకు పోటీలకు ప్రకటన వెలువడింది. రాష్ట్ర సాంకేతిక సలహా మండలి(ఆప్కాస్ట్), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా పోటీలను నిర్వహించనున్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందించడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్ రెండు విభాగాల్లో పోటీలు ఉంటాయి.
క్విజ్ పోటీలకు సంబంధించి 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో మొదట పరీక్ష పెడతారు. అందులో ఉత్తమ మార్కులు వచ్చిన బృందాన్ని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. ఒక్కో తరగతి నుంచి ఒక్కో విద్యార్థి కచ్చితంగా ఉండాలి. గణితం, సైన్సుతో పాటుగా విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి అనే అంశంపై క్విజ్ పోటీలు జరుగుతాయి. విజేతలకు జిల్లా, రాష్ట్రస్థాయిలో నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందిస్తారు. జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతికి రూ.7,500, ద్వితీయ బహుమతికి రూ.6,000, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.4,500 రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు రూ.15,000, రూ.12,000, రూ.9,000, రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిగా రూ.6,000 ఇస్తారు.
పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీలకు ఇలా...: వీటికి 8, 9 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులు. ఒక పాఠశాల నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. జీవవైవిధ్య సంరక్షణ, జల సంరక్షణ, వాతావరణంలో మార్పులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో విజేతలకు జిల్లా స్థాయిలో మొదటి స్థానాలకు వరుసగా రూ.3,000, రూ.2,000, రూ.1,000, రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు రూ.7,500, రూ.5,000, రూ.3,000, రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిగా రూ.1,000లు ఇస్తారు. గెలుపొందినవారికి గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేస్తారు.
ముఖ్యమైన తేదీలివీ... పాఠశాల సమన్వయకర్తలు అక్టోబరు 15వ తేదీలోగా విద్యార్థుల పేర్లను www.bvmap.org ద్వారా నమోదు చేయాలి. క్విజ్కుగాను ముగ్గురు, పోస్టర్ ప్రజంటేషన్కు ఇద్దరు చొప్పున ఎంపిక చేయాలి. ః పాఠశాలస్థాయిలో నవంబరు 2, 3 తేదీల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ః జిల్లాస్థాయిలో నవంబరు 26న, రాష్ట్రస్థాయిలో డిసెంబరు 9న ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్లైన్లోనే... విద్యార్థుల సామర్థాన్ని పరీక్షించేందుకు కౌశల్ పోటీలు మంచి వేదిక. 2022 సంవత్సరానికి సంబంధించి ప్రకటన వచ్చింది. అక్టోబరు 15వ తేదీలోగా వెబ్సైట్లో విద్యార్థుల వివరాలను నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆన్లైన్లోనే ఉంటుంది. సైన్సు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు దోహదపడే ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు పోత్సహించాలి.
- ఎస్.వి.మధుబాబు, జిల్లా సమన్వయకర్త, కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ