రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఇచ్ఛాపురం పట్టణంలోని కొండివీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియలేదు.
బచ్చు పరశురామ్ (పాత చిత్రం)
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: ఇచ్ఛాపురం పట్టణంలోని కొండివీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియలేదు. పట్టణ ఎస్సై కె.గోవిందరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చు పరశురామ్(22) ఇంటర్మీడియట్ పూర్తిచేసి, తండ్రి పాపారావు, తల్లి హేమలకు వ్యాపారంలో సహాయపడుతున్నాడు. సోమవారం బ్రహ్మపుర వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాత్రి పట్టణ పొలిమేరల్లోని సినీ ధియేటర్ వద్ద రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని అటుగా వచ్చినవారు చూసి తమ ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తల, చేతులు, గుండెపై తీవ్ర గాయాలతో ఉన్న అతడికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువ జామున విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కోనేరులో పడి వ్యక్తి మృతి
కాశీబుగ్గ, న్యూస్టుడే: పలాసలోని ముత్యాలమ్మ కోనేరు (నెహ్రూ పార్కు)లో మంగళవారం జారిపడి ఓ వ్యక్తి(40) మృతి చెందాడు. స్థానిక సీఐ శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలికి చెందిన బొమ్మాళి మధు గత కొన్నాళ్లుగా పలాసలో ఉంటున్నాడు. కోనేరులో స్నానానికి దిగి జారి పడటంతో మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.
రైలు ఢీకొని వృద్ధురాలు..
కాశీబుగ్గ, న్యూస్టుడే: పలాస మండలం కిష్టుపురం సమీపంలో మంగళవారం రైలు ఢీకొని వృద్ధురాలు(70) మృతి చెందింది. జీఆర్పీ హెచ్సీ కోదండరావు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం పెద్దలవునిపల్లికి చెందిన ఎస్.రాజేశ్వరి కిష్టుపురంలోని తన కుమార్తె మహలక్ష్మి ఇంటిలో గత మూడు నెలలుగా ఉంటుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లగా రైలు ఢీకొనడంతో మృతి చెందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.