వంతెన రక్షణగోడను ఢీకొన్న వాహనం
జాతీయరహదారిపై టెక్కలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ వాహనం మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట సమీపంలోని గరీబులగెడ్డ వంతెన రక్షణగోడను ఢీకొన్న సంఘటనలో 13 మందికి గాయాలైనట్లు ఎస్ఐ షేక్ఖాదర్భాషా తెలిపారు.
13 మందికి గాయాలు
ఘటనా స్థలంలో క్షతగాత్రులు
కొత్తపేట(కోటబొమ్మాళి),న్యూస్టుడే: జాతీయరహదారిపై టెక్కలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ వాహనం మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట సమీపంలోని గరీబులగెడ్డ వంతెన రక్షణగోడను ఢీకొన్న సంఘటనలో 13 మందికి గాయాలైనట్లు ఎస్ఐ షేక్ఖాదర్భాషా తెలిపారు. మంగళవారం వేకువజామున జరిగిన సంఘటనపై విశాఖపట్నం డాన్స్బేబీ డాన్స్ బృందం సభ్యుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వివరించారు. డ్రైవర్ లక్ష్మీప్రసాద్ వేగంగా వాహనాన్ని నడపటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో నరేష్, లక్ష్మీప్రసాద్, మణిశేఖర్, స్నేహ, అర్చన, రాజు, సరస్వతి, కళ్యాణ్, పూజాసింగ్, అఖనాకుస్వా, సాయికుమార్, ఆనంద్, సోనాలేలు గాయాలపాలయ్యారు. వీరందరినీ కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిలో మణిశేఖర్, లక్ష్మీప్రసాద్, స్నేహ, రాజు, పూజాసింగ్, అఖనాకుస్వాలను శ్రీకాకుళం రిఫర్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సుధారాణి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా