చేతల్లో ఆ ఊపేది?
ఉద్దానం ప్రాంతంలోని 807 కిడ్నీ వ్యాధి పీడిత గ్రామాలకు వంశధార జలాలు అందించాలనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో చేపడుతున్న మెగాతాగునీటి పథకం పనులు సాగుతూనే ఉన్నాయి.
మెగా తాగునీటి పథకం పనులు వెనక్కి
ఇలాగైతే ఇంకా కొద్ది నెలలు ఆగాల్సిందే..
మెళియాపుట్టి వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన నీటి శుద్ధి కేంద్రం ఇది. దీని నిర్మాణం ఇప్పటికే పూర్తయి ఉండాలి. కానీ ఇక్కడ ఇంకా కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యుత్తు పనులు ఇంకా మొదలవనేలేదు. ప్రధాన పైపులైను పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉంది.
ఉద్దానం ప్రాంతంలోని 807 కిడ్నీ వ్యాధి పీడిత గ్రామాలకు వంశధార జలాలు అందించాలనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో చేపడుతున్న మెగాతాగునీటి పథకం పనులు సాగుతూనే ఉన్నాయి. అధికారులు ఇదిగో అదిగో అంటున్నా వెనక్కిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరు పరిశీలిస్తే ట్రయల్ రన్ నిర్వహించాలన్నా కనీసం మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.
న్యూస్టుడే, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు
అధికారులు చెబుతున్నా..: డిసెంబరు నెలాఖరుకు అనంతగిరి, కేదారిపురం క్లస్టర్ల పరిధిలోని సుమారు 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించినా అది అసాధ్యమే. తాజాగా అధికారులు జనవరి మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామంటున్నా.. అదీ సాధ్యమయ్యేలా కన్పించడంలేదు. హిరమండలం వద్ద ప్రధాన రెగ్యులేటరీ, రివర్క్రాసింగ్ తదితర పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మెళియాపుట్టి వద్ద నీటి శుద్ధి యంత్రం అమరిక, ప్రధాన పైపులైన్ల నిర్మాణ పనులు ఊపందుకోవాల్సి ఉంది. మెళియాపుట్టి నుంచి కొరసవాడ వరకు 15 కిలోమీటర్లు కాగా ఇంకా నాలుగు కిలోమీటర్లకు పైగా పైపులైన్లు వేయాల్సి ఉంది. ఇలా పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నాయి.
సాగుతున్నాయి...: హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్ నుంచి నుంచి నీటిని తీసుకుని పాతపట్నం మీదుగా మెళియాపుట్టి తరలించి అక్కడ శుద్ధిచేసి ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంది. హిరమండలంలో ప్రధాన హెడ్ రెగ్యులేటరీ నుంచి పాతపట్నం మండలం కాగువాడ కొండపై ఉన్న సంప్వెల్కు మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి గ్రావిటీ ఫోర్స్తో మెళియాపుట్టిలో ఉండే నీటి శుద్ధి కేంద్రానికి నీరు వెళుతుంది. శుద్ధి అనంతరం ఉద్దానం ప్రాంతంలోని ఆయా క్లస్టర్లకు తాగునీటిని పైప్లైన్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం పైప్లైన్, హెడ్ రెగ్యులేటరీ, నీటిశుద్ధి యంత్రాల అమర్చాల్సి ఉంది. హిరమండలం నుంచి కాగువాడ వరకు పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తిచేశారు. పాతపట్నం, తిడ్డిమి, మామిడిగుడ్డి, సుందరాడ, సిరియాకండి గ్రామాల్లో పైప్లైన్ పనులు చేపడుతున్నారు. మెళియాపుట్టిలో ఉన్న నీటి శుద్ధి యంత్రాలను ఇంకా అమర్చాల్సి ఉంది. విద్యుదీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే వంశధార నీరు ఉద్దానం తలుపుతట్టేది.
అక్కడా అంతే..
మొదటి దశలో అనంతగిరి, కేదారపురం క్లస్టర్ల పరిధిలోని 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలనేది అధికారుల ప్రయత్నం. మరి అక్కడైనా పనులు పూర్తయ్యాయా అంటే అవీ అరకొరగానే ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని అనంతగిరి క్లస్టర్ కింద 23 ట్యాంకులు, కేదారిపురం క్లస్టర్ ద్వారా ఒక ట్యాంకు, మామిడిమెట్టు క్లస్టర్ ద్వారా 15 ట్యాంకులు నిర్మాణం చేపట్టగా.. దేవునల్తాడ, గుణుపల్లి వాటర్ ట్యాంకులు నిర్మాణం, చాలా గ్రామాల్లో పైపు లైను పనులు సైతం పూర్తి కాలేదు. బెండికొండపై ప్రధాన ట్యాంకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. ట్యాంకు నుంచి నీటిని తీసుకునేందుకు పైపులైన్లు నిర్మించాల్సి ఉంది.
పనులు వేగవంతం చేస్తున్నాం
ఉద్దానం తాగునీటి పథకం పనులు వేగవంతం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి మాసంలో ఉద్దానం ప్రాంతంలోని అనంతగిరి, కేదారిపురం క్లస్టర్లకు తొలి విడతలో నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచడం జరిగింది. జనవరి మొదటి వారంలో ట్రయల్రన్ నిర్వహించి, నెలాఖరు నాటికి నీటిని విడుదల చేస్తాం.
జాన్ బెన్హర్, ఈఈ, ఉద్దానం ప్రాజెక్టు
పాతపట్నం వద్ద అరకొరగా ప్రధాన పైప్లైన్ పనులు
వంశధార వద్ద రివర్క్రాసింగ్ పనులను నవంబరు 20 నాటికి పూర్తిచేయాలి. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు మొదటి రెండు క్లస్టర్ల పరిధిలోని సుమారు 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యం. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా, నిర్లక్ష్యం చేసినా శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం.
శ్రీకేష్ బి.లఠ్కర్, కలెక్టర్ (ఈ ఏడాది అక్టోబరు 22న ప్రాజెక్టు ఇంజినీర్లు,గుత్తేదారులతో జరిగిన సమావేశంలో..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు