నీరుగారిపోతోంది..!
సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ, వర్షాధార భూముల్లో సాగుచేసే రైతన్నలకు సాయపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలకళ పథకాన్ని తీసుకొచ్చింది.
పూర్తిస్థాయిలో వేయని జలకళ బోర్లు
వేసిన వాటికి ఇవ్వని విద్యుత్తు కనెక్షన్లు
-న్యూస్టుడే, రణస్థలం
జేఆర్పురం రెవెన్యూ పరిధిలో ఇలా..
సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ, వర్షాధార భూముల్లో సాగుచేసే రైతన్నలకు సాయపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హత గలవారికి ఉచితంగా బోర్లు వేసి, విద్యుత్తు కనెక్షన్లు ఇస్తారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఇందుకు అర్హులు. దీంతో పాటు ఒకే ప్రాంతంలో రెండున్నర ఎకరాల భూమి ఉండాలనే నిబంధన ఉంది. జిల్లాలో అర్హత కలిగిన రైతులంతా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకం ఆదిలోనే నీరుగారుతోంది. లబ్ధిదారుల్లో అధికశాతం మందికి బోర్లే వేయలేదు. కొంతమందికి వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు.
జిల్లా వ్యాప్తంగా 5,718 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 4,698 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. వీరి దరఖాస్తులు డ్రిల్లింగ్ గుత్తేదార్లకు అప్పగించారు. జియాలజిస్టులు ద్వారా సర్వే చేయించి ఎవరెవరికి బోర్లు వేయాలో ఎక్కడెక్కడ నీరు పడుతుందో నిర్ధారించి నివేదిక అందజేయాల్సి ఉంది. ఇలా 1207 బోర్లకు జియోలాజికల్ సర్వే చేయగా అందులో 1010 బోర్లకు నీరు పడుతుందని డ్వామాకు నివేదిక ఇచ్చారు. అనంతర ప్రక్రియలో 765 దరఖాస్తులు ఆమోదించి మంజూరు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 246 బోర్లు మాత్రమే వేశారు.
* విద్యుత్తు కనెక్షను, బోరు డ్రిల్లింగ్కు కలిపి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత రూ.2 లక్షలు దాటితే తర్వాత అయ్యే వ్యయం అంతా రైతులే పెట్టుకోవాలనే నిబంధన పెట్టారు. ఈ మేరకు జిల్లాలో డ్రిల్లింగ్ చేసిన 13 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వేశారు. వాటికి అయిన ఖర్చు విద్యుత్తు శాఖకు చెల్లించకపోవడంతో మిగిలిన వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. అప్పటి నుంచి డ్రిల్లింగు చేసిన బోర్లు అలానే దర్శనమిస్తున్నాయి.
ఇదీ సమస్య..
ఇప్పటివరకు వేసిన వాటిలో పదమూడింటికే విద్యుత్తు సరఫరా ఇవ్వడంతో మిగిలినవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. వాటికి ప్రభుత్వం కనెక్షన్లు ఇస్తుందో లేదో తెలియదు. రైతులు సొంత డబ్బులతో వేసుకుందామంటే విద్యుత్తు శాఖ నిబంధనలు, అధిక మొత్తంలో ఖర్చు భరించలేక వెనకడుగు వేస్తున్నారు. కనెక్షన్లు ఇవ్వాలంటే ట్రాన్స్ఫార్మరు అందుబాటులో ఉందా లేదా, స్తంభాలెన్ని పడతాయి, 11 కేవీలైను అందుబాటులో ఉందా లేదా అనే అంశాలను పరిశీలించి ఎంతమేర ఖర్చవుతుందో అంచనా వేసి రైతులకు తెలియజేయాలి. ఆ దిశగా ఇప్పటి వరకు ప్రయత్నాలేవీ జరగలేదు.
ఏడాదిన్నర అయ్యింది..
జలకళ పథకంలో వ్యవసాయ బోరువేసి ఏడాదిన్నరైంది. ఇంతవరకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు. అప్పట్లో ప్రభుత్వమే ఇస్తామంది. ఇప్పుడు లేదంటున్నారు. సొంతంగా ఖర్చుపెట్టి వేసుకోలేం. ఇప్పుడు వేసిన బోరు పరిధిలో నలుగురు రైతులకు చెందిన ఐదెకరాలు ఉంది అందరం పేద రైతులమే. ప్రభుత్వం బోరు వేసినా ఉపయోగం లేకుండా పోయింది.
- మంత్రి పార్వతి, మహిళారైతు, కొండములగాం
గుత్తేదారులకు చెప్పాం..
అనుమతి పొందిన బోర్లన్నీ డ్రిల్లింగ్ చేయాలని గుత్తేదారులకు చెప్పాం. విద్యుత్ కనెక్షన్లు ప్రభుత్వం ఇవ్వదు. రైతులే భరించాలి. అందుకు విధి విధానాలు త్వరలో ప్రభుత్వం ఖరారు చేస్తుంది.
-జీవీ చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్