అన్నదాతలకు పెద్దపీట: స్పీకర్
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేస్తోందని, విపత్తుల సమయాల్లోనూ ఆదుకుంటోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
నమూనా చెక్కును అందిస్తున్న స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్ లఠ్కర్
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేస్తోందని, విపత్తుల సమయాల్లోనూ ఆదుకుంటోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సున్నావడ్డీ రాయితీని సోమవారం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీ అధ్యక్షురాలు పి.విజయ, కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ పాల్గొన్నారు. 1,42,893 మంది రైతుల ఖాతాల్లో రూ.28.08 కోట్ల వడ్డీ రాయితీ మంజూరు చేసినట్లు స్పీకరు తెలిపారు. రబీ 2020-21లో 28,289, ఖరీఫ్లో 2021లో 59,726, గతేడాది వడ్డీ రాయితీ జమకాని 54,878 మందికి పై మొత్తం ఖాతాల్లో జమ చేశామన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కింద 3,398 మందికి రూ.1.15 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, డీసీసీబీ ఛైర్మన్ కె.రాజేశ్వరరావు, కేంద్రమాజీ మంత్రి కె.కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.