ఉలుకూ..పలుకూ లేదు..!
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో మండల కేంద్రాలకు భారీగా సిమెంట్, ఇసుక నిల్వలు వస్తున్నాయి
అదనపు ఇసుక, సిమెంటు వినియోగంపై ఇప్పటికీ తేల్చని అధికారులు
న్యూస్టుడే, ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి)
కొత్తపేటలో అసంపూర్తిగా సచివాలయం, ఆర్బీకే భవన నిర్మాణం
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో మండల కేంద్రాలకు భారీగా సిమెంట్, ఇసుక నిల్వలు వస్తున్నాయి. కానీ కేటాయించిన సామగ్రి, వినియోగానికి సంబంధించి మండల అధికారుల వద్ద పూర్తి వివరాలు ఉండటం లేదు. ఇందుకు ఉదాహరణ కోటబొమ్మాళి మండలమే. ఇక్కడ ఇసుక, సిమెంటు సరఫరా అయిన స్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం గమనార్హం. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
సమాచారం ఇవ్వలేక..!
కోటబొమ్మాళి మండలంలో ఉపాధి పథక నిధులతో 27 సచివాలయాల భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. వీటిలో 17 నిర్మాణాలను పంచాయతీరాజ్శాఖ, మరో పదింటి పనులను గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటిలో కొత్తపేట, జర్జంగి 1, 2 సచివాలయాల పరిధిలోని 9, హరిశ్చంద్రపురంలోని ఒక భవనం పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. వాటి నిర్మాణాలకు ఎంత సిమెంటు, ఇసుక వచ్చాయనేది ఎంపీడీవో అడిగినా పైరెండు శాఖల అధికారులు సమాచారం ఇవ్వలేకపోతున్నారు.
కొత్తపేట, జర్జంగి, హరిశ్చంద్రపురంలో పరిధిలోని పది భవనాల నిర్మాణానికి 4,600 సిమెంట్ బస్తాలు, వెయ్యి టన్నుల ఇసుకను గుత్తేదారుకు అదనంగా ఇచ్చినట్లు ఎంపీడీవో ఫణీంద్రకుమార్ గుర్తించారు. సామగ్రి నిల్వలున్నా ఆయా భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జర్జంగి-2 పరిధిలోని శ్రీజగన్నాథపురంలో అసంపూర్తి భవనాలపై గ్రామస్థులు జిల్లా కేంద్రంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో అక్టోబరు 13న ‘కట్టారా... కొట్టేశారా...!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంపీడీవో అదేరోజు కలెక్టర్ నుంచి వచ్చిన స్పందన ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనాన్ని జత చేసి పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులకు నోటీసులు పంపారు. ‘‘ప్రాధాన్యత గల పది భవనాల పనులు చాలా రోజులుగా నిలిచిపోయాయి. సదరు గుత్తేదారు సైతం స్పందించడం లేదు. గుత్తేదారుడిని మార్చి, నిర్మాణాలను పునరుద్ధరించాలి. అందుకు భవనాల వారీగా గుత్తేదారుకు కేటాయించిన సిమెంటు, ఇసుక.. వినియోగించిన సామగ్రి వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలి’’ అని అందులో పేర్కొన్నారు.
అధికారుల బదిలీలతో..
మండలంలోని పంచాయతీరాజ్ విభాగంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు అధికారులు మారారు. గత నెల 13న ఎంపీడీవో పంపిన నోటీసుపై గ్రామీణ నీటి సరఫరా శాఖ జేఈ ప్రజ్ఞశ్రీ సంతకం చేశారు. అక్కడికి రెండు రోజుల్లోనే ఆమె బదిలీపై వెళ్లిపోయారు. కొత్త జేఈ విధుల్లో చేరారు. పీఆర్ కార్యాలయంలో ఈ పనులు చూస్తున్న వర్క్ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉన్నా ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ‘స్పందన’ అర్జీని పంపినా సంబంధిత శాఖల నుంచి ఉలుకూ, పలుకూ లేకపోవడం గమనార్హం.
ఇంతవరకు ఇవ్వలేదు..: సచివాలయాలకు కేటాయించిన సిమెంట్, ఇసుక వివరాలను ఇవ్వాలని గత నెలలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగినా ఇప్పటివరకు సమాధానం రాలేదు. జర్జంగి 1, 2, కొత్తపేట, హరిశ్చంద్రపురాలకు సంబంధించిన వివరాలూ ఇవ్వలేదు. అదే నెల 23న మరోసారి ఆ సామగ్రి వివరాలివ్వాలని అధికారికంగా కోరినా సమాధానం రాలేదు. వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మరోవైపు బదిలీపై వెళ్లిన అధికారులు కొత్తగా వచ్చినవారికి ఛార్జీల (లావాదేవీల) వివరాలు ఇవ్వలేదు.
- కె.ఫణీంద్రకుమార్, ఎంపీడీవో, కోటబొమ్మాళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే