logo

చిన్నారి మృతిపై ఆందోళన

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సోమవారం రాత్రి 45 రోజుల వయసున్న బాబు చనిపోవడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.

Published : 29 Nov 2022 06:16 IST

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సోమవారం రాత్రి 45 రోజుల వయసున్న బాబు చనిపోవడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. సీతంపేటకు చెందిన శోభారాణి కుమారుడు నాలుగు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో సర్వజనాసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. మూడు రోజులైనా కోలుకోకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకువెళతామని కోరినప్పటికీ బాబు ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పడంతో ఊరుకున్నారు. సోమవారం డిశ్చార్జి చేయాలని కోరగా చనిపోయాడని చెప్పారని బాధిత బంధువుల వెంకటరావు, సత్యనారాయణ వాపోయారు. ఇక్కడ వైద్యం ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. వేరే ఆసుపత్రికి తీసుకెళతామంటే వద్దనడంతోనే సమస్య ఏర్పడి బాబు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామినాయుడు వద్ద ప్రస్తావించగా ఈ ఘటనపై విచారణ చేయిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని