చిన్నారి మృతిపై ఆందోళన
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సోమవారం రాత్రి 45 రోజుల వయసున్న బాబు చనిపోవడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సోమవారం రాత్రి 45 రోజుల వయసున్న బాబు చనిపోవడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. సీతంపేటకు చెందిన శోభారాణి కుమారుడు నాలుగు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో సర్వజనాసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. మూడు రోజులైనా కోలుకోకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకువెళతామని కోరినప్పటికీ బాబు ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పడంతో ఊరుకున్నారు. సోమవారం డిశ్చార్జి చేయాలని కోరగా చనిపోయాడని చెప్పారని బాధిత బంధువుల వెంకటరావు, సత్యనారాయణ వాపోయారు. ఇక్కడ వైద్యం ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. వేరే ఆసుపత్రికి తీసుకెళతామంటే వద్దనడంతోనే సమస్య ఏర్పడి బాబు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘న్యూస్టుడే’ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వామినాయుడు వద్ద ప్రస్తావించగా ఈ ఘటనపై విచారణ చేయిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?