logo

విధుల్లోనే ఆగిన ఊపిరి

మందస మండలం భిన్నలమదనాపురానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను మార్పు మల్లేశ్వరరావు(39) హైదరాబాదులో విధులు నిర్వహిస్తూ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు

Published : 29 Nov 2022 06:16 IST

మల్లేశ్వరరావు (పాత చిత్రం)

హరిపురం(మందస), న్యూస్‌టుడే: మందస మండలం భిన్నలమదనాపురానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను మార్పు మల్లేశ్వరరావు(39) హైదరాబాదులో విధులు నిర్వహిస్తూ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు ఫోనులో సమాచారం రావడంతో తల్లిదండ్రులు కామేశ్వరరావు, సీతమ్మ బోరున విలపించారు. మృతదేహం సోమవారం గ్రామానికి చేరడంతో విషాదం అలముకుంది. మల్లేశ్వరరావుకు భార్య నిర్మల, పన్నెండేళ్లలోపు కుమార్తెలు ఇద్దరున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని