అక్రమాలకు హద్దులు చెరిపేశారు..!
కలపతో చేసిన గృహోపకరణాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో బహిరంగ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది.
యథేచ్ఛగా అటవీ కలప రవాణా
మెళియాపుట్టిలోని మహేంద్రతనయ నది చెంత తరలించేందుకు సిద్ధం చేసిన కలప
న్యూస్టుడే, మెళియాపుట్టి, పాతపట్నం: కలపతో చేసిన గృహోపకరణాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో బహిరంగ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాల నుంచి టేకు, మద్ది, మామిడి, నేరేడు, తదితర చెట్లను నరికి కలపగా మార్చి అక్రమంగా ఇతర ప్రాంతాలకు అక్రమార్కులు తరలించి విక్రయించుకుంటూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వృక్షాలను సైతం కూల్చేస్తున్నారు. అటవీ, రెవెన్యూ, పోలీసుల నిఘాకు కళ్లుకప్పి అక్రమ దందాకు పాల్పడుతున్నారు.
కలప వినియోగం పెరగడంతో అక్రమ రవాణా రోజురోజుకు తీవ్రమతోంది. అధికారులు నిఘా పెడుతున్నామని చెబుతున్నా ఈ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాలైన మెళియాపుట్టి నుంచి టెక్కలి జాతీయ రహదారి, పాతపట్నం నుంచి మెళియాపుట్టి, గారబంద, (ఒడిశా), గొప్పిలి మీదుగా పలాస, మందస, సోంపేట మండలాలకు, పాతపట్నం నుంచి తెంబూరు, బొంతు కూడలి మీదుగా టెక్కలి, చల్లపేట టింబరు డిపోలకు తరలిస్తుంటారు. రాత్రివేళల్లో, సెలవు దినాల్లోనే అక్రమార్కులు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సోంపేట, సారవకోట, జలుమూరు, కొత్తూరు, ఎల్ఎన్పేట మండలాలు కేంద్రాలుగా రవాణా, కలప కోత, వస్తువుల తయారీ ఎక్కువగా జరుగుతున్నాయి.
నిఘా ఏదీ..
ఇటీవల పాతపట్నం మండల పరిధిలోని ఓ టింబర్ డిపో నుంచి సోంపేటకు రాత్రి సమయంలో దర్జాగా లారీలో కలప రవాణా జరిగింది. మెళియాపుట్టిలోని మహేంద్రతనయ సమీపంలో భారీగా కలపను లారీలో లోడ్ చేసి తరలించారు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తెలియదంటూ దాటవేశారు. తాజాగా మహేంద్రతనయ చెంత భారీ వృక్షాలను కలపగా మార్చి తరలించేందుకు సిద్ధం చేశారు. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి, హిరమండలం, టెక్కలి, పలాస, మందస, సారవకోట, జలుమూరుల్లో టింబరు డిపోలు(సా మిల్లులు), కలప కోత యంత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిపై అటవీ అధికారుల నిఘా కొరవడింది. వీటికి వస్తున్న కలపలో సగం సక్రమమైతే.. మిగిలిన సగం అక్రమమేనని తెలుస్తోంది.
సిబ్బంది సహకారంతోనే..
అక్రమార్కులకు మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది తోడవ్వడంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అటవీశాఖకు చెందిన కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కిందిస్థాయి సిబ్బంది సమాచారంతోనే అక్రమార్కులు అప్రమత్తమవుతున్నారని పలువురు చెబుతున్నారు.
కేసులు పెడుతున్నాం..
- ఆర్.రాజశేఖర్, ప్రాంతీయ అటవీ అధికారి, పాతపట్నం
పాతపట్నం అటవీ పరిధిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది ఏర్పడింది. కలప అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పట్టుబడితే కేసులు పెడుతున్నాం. కింది స్థాయి సిబ్బంది భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు
[ 23-04-2024]
ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
[ 23-04-2024]
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
[ 23-04-2024]
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. -
నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
[ 23-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. -
పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
[ 23-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. -
పలాసలో చుక్కలు చూపిన వైకాపా ర్యాలీ
[ 23-04-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు నామినేషన్ సందర్భంగా ప్రచార ఆర్భాటానికి చేపట్టిన ర్యాలీతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల వాసులు విలవిలలాడారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. కళ్లకు గంతలే..!
[ 23-04-2024]
రాష్ట్రంలో తీర ప్రాంతానికి ముఖద్వారంగా పేర్కొనే ఇచ్ఛాపురం మండలం డొంకూరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. -
కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
[ 23-04-2024]
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. -
నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. -
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
[ 23-04-2024]
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
77 మందికి షోకాజ్ నోటీసులు
[ 23-04-2024]
ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ