logo

మంత్రి బొత్స వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి డిమాండు చేశారు.

Published : 30 Nov 2022 05:57 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎక్కడా సంప్రదాయాలు పాటించలేదని, బెదిరింపు చర్యలకు పాల్పడి కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని చూడటం సరి కాదన్నారు. ఉద్యోగుల సమస్యలను మంత్రి బొత్స కనీసం వినిపించుకునే ప్రయత్నం చేయకపోగా కాళ్లుపట్టుకుని బతిమాలుకోవాలని సలహా ఇవ్వడం తగదన్నారు. ఉద్యోగులు పోరాటాల ద్వారానే హక్కులు సాధిస్తున్నారనేది తెలుసుకోవాలన్నారు. ః మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు టి.మురళీమోహనరావు, డి.కేశవరావులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, సంఘ నాయకులు ప్రభుత్వంలో ఒక భాగంగా చూడాలన్నారు. కించపరిచే విధంగా మాట్లాడటం మంత్రి స్థాయికి తగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని