logo

పీర్లకొండ.. భక్తజనమే నిండా..

ఇచ్ఛాపురంలోని పీర్లకొండ గురువారం యాత్రికులతో కిటకిటలాడింది. యాత్రలలో రెండోవారం కూడా జనం పోటెత్తారు. ఒడిశా, ఆంధ్రా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Published : 02 Dec 2022 03:07 IST

ఇచ్ఛాపురంలోని పీర్లకొండ గురువారం యాత్రికులతో కిటకిటలాడింది. యాత్రలలో రెండోవారం కూడా జనం పోటెత్తారు. ఒడిశా, ఆంధ్రా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండ దిగువ మెట్టు వద్ద కొబ్బరికాయను కొట్టి పైనున్న పవిత్ర కట్టడాలలో పూజలకు బయలుదేరారు. దిగువ పీఠంలోని కందకంలో నీటిని చెవిలో వేసుకున్నారు. తీర్థంగా స్వీకరించారు. ఎగువ కట్టడం వద్ద ముస్లిం పూజారులు పూజలు చేశారు.

-న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని