కిశోరి వికాసం ఏమైంది?
లక్షల మంది బాలబాలికలకు అవగాహన కల్పించే వైఎస్ఆర్ కిశోరి వికాసం కార్యక్రమం నిధుల్లేక నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2016లో ‘బాలకా తెలుసుకో’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- న్యూస్టుడే, బలగ(శ్రీకాకుళం)
మూడో విడతకు సంబంధించి గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న అధికారులు(పాత చిత్రం)
లక్షల మంది బాలబాలికలకు అవగాహన కల్పించే వైఎస్ఆర్ కిశోరి వికాసం కార్యక్రమం నిధుల్లేక నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2016లో ‘బాలకా తెలుసుకో’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని మంచి స్పందన రావడంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్ కిశోరి వికాసం’గా పేరుమార్చి అమలు చేశారు. రెండు విడతల పాటు కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థినులు లబ్ధి పొందారు. ఆ తరువాత నిధుల లేమితో మూడో ఏడాది ముందుకు సాగలేదు. మళ్లీ ఇప్పటివరకు దాని ప్రస్తావన తెరపైకి రాలేదు.
ఏం చేశారు..
కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేసి విద్యార్థినులకు ఆరోగ్యం, స్త్రీ-పురుష సమానత్వం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్, పరిశుభ్రత, భవిష్యత్తు, పిల్లలపై హింస, వివక్షత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రక్తహీనత, బాల్య వివాహాలు, చదువు మధ్యలోనే మానేయడం, ప్రేమ పేరిట వేధింపులను నివారించేందుకు అవగాహన తరగతులను నిర్వహించేవారు. ఇందుకుగానూ ఆసక్తి గల పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థినులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా జిల్లాలోని పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలల్లోని ఆడపిల్లలకు అవగాహన కల్పించారు. జిల్లాలో మొదటి ఏడాది(2017-18) పాఠశాల విద్యార్థినులకే దీన్ని పరిమితం చేశారు. అప్పుడు 17,750 మందికి బాలికలకు అవగాహన కల్పించారు. రెండో ఏడాది జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థినులను చేర్చి 74939 మంది లబ్ధి చేకూర్చారు.
ప్రయోజనం ఇలా ..
కార్యక్రమం వల్ల అనేక లాభాలున్నాయి. కిశోర బాలికలకు విషయ పరిజ్ఞానం, జీవన నైపుణ్యాలు పెంపొందుతాయి. జీవితంలో ఒకరిపై ఆధారపడకుండా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకునే ధోరణి అలవడుతుంది. వారి బాధలను ఇతరులతో పంచుకునే వీలు కలుగుతుంది. ఇతరుల నుంచి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీంతో పాటు శిక్షణ ఇచ్చే పీజీటీల్లోనూ నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. బాలికా సంరక్షణపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. వివిధశాఖల అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయమవుతారు. నిపుణులతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. సమాజానికి సేవ చేశామనే తృప్తి లభిస్తుంది.
ఉద్దేశమిదీ...
కౌమార దశలో ఉన్న బాలికలల్లో ఆరోగ్య, భౌతిక పరమైన మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో వారు తోటి విద్యార్థులు, సమాజం నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా నిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
నిధుల్లేక ఆగిపోయింది...
వైఎస్ఆర్ కిశోరి వికాసం మూడో విడత 2019-20 సంవత్సరంలో అమలు కావాల్సి ఉంది. కానీ జరగలేదు. కార్యక్రమం నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదలకాకపోవడంతో నిర్వహించ లేకపోయాం. పథకం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులను నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే వాటిని పాటిస్తాం.
- కె.వి.రమణ, డీసీపీవో, శ్రీకాకుళం
జిల్లాలో వివరాలిలా...
* మొత్తం ప్రాజెక్టులు 15
* పీఆర్జీ (ప్రాజెక్టు రిసోర్స్ గ్రూప్) సభ్యులు 144
* శిక్షణ పొందిన పీఆర్జీ సభ్యులు 144
* ఎంపికైన పీజీటీలు 6,345
* శిక్షణ ఇవ్వాల్సిన పాఠశాలలు 1,281
* జూనియర్ కళాశాలలు 196
* పాలిటెక్నిక్ 10 * ఐటీఐ 26
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది