logo

పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Published : 02 Dec 2022 03:07 IST

సభలో ప్రసంగిస్తున్న కూన రవికుమార్‌, పక్కన ఎంపీ రామ్మోహన్‌నాయుడు తదితరులు

పాతపట్నం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు, ఉద్యోగులకు మాయమాటలు చెప్పి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి, అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లాను అభివృద్ధి చేయలేని స్థానిక మంత్రులు మూడు రాజధానులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏ రోజు ఎన్నికలు వచ్చినా పార్టీని గెలిపించి, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకముందు తెదేపా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. అయిదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని