రహదారి ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కొల్లివలస పంచాయతీ సంకురాడ కూడలి వద్ద గురువారం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం కాలనీకి చెందిన గోవిందరావు పాలకొండ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.
బూర్జ, న్యూస్టుడే: కొల్లివలస పంచాయతీ సంకురాడ కూడలి వద్ద గురువారం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం కాలనీకి చెందిన గోవిందరావు పాలకొండ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో పాలకొండ నుంచి ఆమదాలవలస వైపు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గికి చెందిన మరోవ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో గోవిందరావు(45) రహదారిపై పడ్డాడు. అదే సమయంలో పాలకొండ వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొని సుమారు 30 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు సమాచారం అందించిన సుమారు గంట తర్వాత 108 వాహనం రావడంతో అప్పటికే క్షతగాత్రునికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు పాలకొండ ఆంజనేయనగర్లోని దుకాణంలో బీరువాలు తయారు చేస్తుంటాడు. సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడంతో అర్ధగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. తర్వాత చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఛార్జి ఎస్ఐ రఘునాథరావు చెప్పారు.
మద్యం చోరీ ఘటనలో ముమ్మర దర్యాపు
లావేరు, న్యూస్టుడే: లావేరు మండలం మురపాక సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీగా మద్యం చోరీకి గురైన విషయం తెలిసిందే. చోరీకి గురైన మద్యాన్ని బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావేరు పోలీస్ స్టేషనులో భద్రపరిచినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. గురువారం డీఎస్పీ ఎం.మహేంద్ర, సీఐలు స్వామినాయుడు, పైడియ్య పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు