logo

3, 4 తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు

శ్రీకాకుళం నగరంలో ఈ నెల 3, 4వ తేదీల్లో సీఐటీయూ జిల్లా 11వ మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు , తెలిపారు.

Updated : 02 Dec 2022 07:29 IST

మహాసభల లోగో విడుదల చేస్తున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఇతర నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో ఈ నెల 3, 4వ తేదీల్లో సీఐటీయూ జిల్లా 11వ మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు , తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలోని డైమండ్‌ పార్కు వద్ద మహాసభల లోగోను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మూడో తేదీన కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు. కార్మికులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం  చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నర్శింగరావు, ప్రధానకార్యదర్శి ఎంఏ గఫూర్‌ హాజరుకానున్నట్లు చెప్పారు. మహసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై భవిష్యత్తులో పోరాటాలను చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.సత్యనారాయణ, యూనియన్‌ నాయకులు ఎం.హరనాథరావు, కామేశ్వరరావు, లక్ష్మణరావు, చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని