ఆరు గంటల్లోనే నిర్మించేశారు..
జిల్లాలో రెండు చోట్ల గురువారం రైల్వే అండర్ పాస్ వంతెనలను నిర్మించారు. ఆరు గంటల్లో యుద్ధప్రాతిపదికన అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు భారీ క్రేన్లు, పొక్లెయిన్లను వినియోగించారు.
చిక్కాలవలస రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ నిర్మాణం
జిల్లాలో రెండు చోట్ల గురువారం రైల్వే అండర్ పాస్ వంతెనలను నిర్మించారు. ఆరు గంటల్లో యుద్ధప్రాతిపదికన అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు భారీ క్రేన్లు, పొక్లెయిన్లను వినియోగించారు. రైల్వేలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, కార్మికులు ఇందులో భాగస్వాములయ్యారు. ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామం వద్ద మధ్యాహ్నం 2.10 నుంచి రాత్రి 8.25 గంటల మధ్య ఒకటి, దాదాపు అదే సమయంలో నరసన్నపేట మండలం ఉర్లాం రైలు నిలయానికి సమీపంలో చిక్కాలవలస రైల్వే గేటు వద్ద మరో అండర్ పాస్ వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రక్రియ పూర్తయ్యాక యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగాయి. దీని వల్ల ప్రయాణికులకు ఆయా ప్రాంతాల్లో రైల్వే గేటు ఇబ్బందులు తీరనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
పలు రైళ్లు రద్దు: రైల్వే అండర్ పాస్ వంతెన నిర్మాణాల్లో భాగంగా గురువారం పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. విశాఖపట్నం-భువనేశ్వర్, భువనేశ్వర్-విశాఖపట్నం, బ్రహ్మపుర-విశాఖపట్నం, విశాఖపట్నం-బ్రహ్మపుర, విశాఖపట్నం-పలాస, పలాస-విశాఖపట్నం రైళ్లను రద్దు చేశారు. కోణార్క్, ఫలక్నుమా, బెంగళూర్-గౌహతి, భువనేశ్వర్-చెన్నై, విశాఖపట్నం-దుర్గ్ ఎక్స్ప్రెస్ రైళ్లు సుమారు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడిచాయి.
- న్యూస్టుడే, ఆమదాలవలస గ్రామీణం, నరసన్నపేట గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్