విద్యాలయాలకు బాసట!
విద్యావ్యవస్థలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించింది.
పీఎంశ్రీ పథకానికి 599 పాఠశాలలు ఎంపిక
న్యూస్టుడే, కవిటి
పీఎంశ్రీ పథకానికి ఎంపికైన రాజపురం జడ్పీ ఉన్నత పాఠశాల
విద్యావ్యవస్థలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి పరికరాలతోపాటు నాణ్యమైన విద్య అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా పథకానికి 599 పాఠశాలలు ఎంపికయ్యాయి.
జిల్లాలో శ్రీకాకుళం నగరం, గ్రామీణ ప్రాంతాల పరిధిలో గరిష్ఠంగా 56, ఇచ్ఛాపురం 41, కనిష్ఠంగా సరుబుజ్జిలి 1, లక్ష్మినర్సుపేట పరిధిలో 7 పాఠశాలలు ఎంపికయ్యాయి. పీఎంశ్రీ పథకానికి అర్హత సాధించాలంటే విద్యార్థుల సంఖ్య, విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన పురోగతి, పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, దస్త్రాల నిర్వహణ, క్రీడాస్థలం, వంటశాల, వైద్యపరీక్షల నిర్వహణ, తల్లిదండ్రుల యాజమాన్య కమిటీ నిర్వహణ, 2021-22లో యూడైస్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆ మేరకు 46 అంశాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెబ్సైట్లో వివరాలను నమోదు చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని గ్రామీణప్రాంతంలో 60, పట్టణపరిధిలో 70 శాతం మార్కులు సాధించిన బడులను ఎంపిక చేశారు.
ప్రయోజనాలివీ...
పీఎంశ్రీలో ఎంపికైన పాఠశాలలకు కేంద్రం నేరుగా నిధులు జమచేస్తుంది. కేంద్రం 60 శాతం నిధులు జమచేస్తే రాష్ట్రం 40 శాతం భరించాలి. కృత్యాధార, వృత్యంతర బోధనాంశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. జాతీయ విద్యావిధానం స్థాయిలో విద్యుత్తు, ల్యాబ్, క్రీడలు, డిజిటల్, సాంకేతిక, మౌలిక వసతులు కల్పిస్తారు. ఎంపికైన పాఠశాలలకు ఐదేళ్లపాటు కేంద్రం ఆర్థిక వనరులు తోడ్పాటునందిస్తుంది.
విద్యార్థుల సామర్థ్యం పెంపునకు దోహదం..
పీఎంశ్రీ పథకం నూతన జాతీయ విద్యావిధానం అమలుకు దోహదపడుతుంది. నాడు-నేడుకు తోడుగా పీఎంశ్రీ పథకం అమలుతో విద్యావిధానం సరికొత్తపోకడ సంతరించుకోనుంది. ప్రత్యేక బోధనతో ప్రతి విద్యార్థి సామర్ధ్యాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది.
- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం
జిల్లాలో వివరాలిలా...
పాఠశాల స్థాయి ఎంపికైనవి
ప్రాథమిక 390
ప్రాథమికోన్నత 96
ఉన్నత 113
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.