logo

పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే చర్యలేవి: జనసేన

టెక్కలి పట్టణంలో జనసేన నేతలు శనివారం నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగి 42 రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 04 Dec 2022 06:00 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న జనసేన శ్రేణులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి పట్టణంలో జనసేన నేతలు శనివారం నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగి 42 రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలి అంబేడ్కర్‌ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రేణులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ సూర్యచంద్రమౌళికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్లచొక్కాలు ధరించి నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని