విషాద యాత్ర..
వారిద్దరూ భవానీ భక్తులు.. దుర్గమ్మనే నమ్ముకొని ఏటా మాల వేస్తున్నారు.. దీక్ష అనంతరం కాలినడకనే ఎప్పుడూ అమ్మసన్నిధికి వెళుతుంటారు.. ఈసారి కూడా దీక్ష పూర్తి చేసుకున్నారు... ఇరుముడి కట్టి.. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు..
భవానీ భక్తులపై దూసుకొచ్చిన కారు
తుని వద్ద జరిగిన ఘటనలో ఇద్దరి దుర్మరణం
న్యూస్టుడే, తుని పట్టణం, జి.సిగడాం
సంతోష్, ఈశ్వర్రావు (పాత చిత్రాలు)
వారిద్దరూ భవానీ భక్తులు.. దుర్గమ్మనే నమ్ముకొని ఏటా మాల వేస్తున్నారు.. దీక్ష అనంతరం కాలినడకనే ఎప్పుడూ అమ్మసన్నిధికి వెళుతుంటారు.. ఈసారి కూడా దీక్ష పూర్తి చేసుకున్నారు... ఇరుముడి కట్టి.. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు.. అడుగులో అడుగులు వేసుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు.. కానీ మార్గమధ్యలో మాటేసిన మృత్యువు వీరిని అమ్మ సన్నిధికి చేరకుండా చేసింది.. కారు రూపంలో వచ్చి నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. కాకినాడ జిల్లా తుని సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలయ్యారు.
సంతోష్ ఇంటి వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన రావి సంతోష్ (30), నల్ల ఈశ్వరరావు (38), మహేష్, జి.గిరి భవానీ మాల వేసుకున్నారు. మాలవిరమణ కోసమని స్వగ్రామం నుంచి విజయవాడకు గత నెల 26న కాలినడకన బయల్దేరారు. వీరంతా శుక్రవారం రాత్రి తుని జాతీయ రహదారి సమీపాన పాయకరావుపేట వద్ద అమ్మవారి ఆలయంలో బస చేశారు. శనివారం ఉదయం ఆరు గంటలకు పూజ చేసుకుని యాత్రను కొనసాగించారు. 6.30 గంటల సమయంలో ముందు ఇద్దరు, వెనుక మరోఇద్దరు రోడ్డుకు పక్కగా నడిచి వెళుతున్నారు. డీమార్ట్ దాటాక ఒక దాబా వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి అతి వేగంగా ఓ కారు వీరిపైకి దూసుకొచ్చింది. మరో వాహనాన్ని దాటించబోయి అదుపుతప్పి సంతోష్, ఈశ్వరరావులను అతి బలంగా ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమతో వచ్చిన ఇద్దరు ఎక్కడపడ్డారో.. ఏం జరిగిందో తెలియనట్లుగా ఈ ఘోరం క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ఛార్జి సీఐ సన్యాసిరావు తెలిపారు.
* రావి సంతోష్కు 2019లో సంధ్య అనే యువతితో వివాహం జరిగింది. తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇంకా సంతానం కలగలేదు. అమ్మనే నమ్ముకుని ఏటా మాలవేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో తమ పరిస్థితి ఎలా దేవుడా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.
* నల్ల ఈశ్వర్రావు భార్య నీలవేణి, తల్లిదండ్రులు, అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పదేళ్లుగా భవానీ మాల వేస్తున్నారు. కాలినడకన వద్దని ఇంట్లోవాళ్లు వారించినా, ఏం కాదంటూ వెళ్లారని, ఇంతలోనే తమకు దూరమవుతారని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్తు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, ఇప్పుడు ఎవరు దిక్కని విలపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం