logo

తెదేపా హయాంలోనే బీసీలకు పెద్దపీట

తెదేపా హయాంలోనే బీసీలకు పెద్దపీట వేసినట్లు ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు.

Published : 08 Dec 2022 05:32 IST

కలెక్టర్‌ కార్యాలయం వద్ద తెదేపా నాయకులను అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తెదేపా హయాంలోనే బీసీలకు పెద్దపీట వేసినట్లు ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన నేతలను పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. దీంతో వారంతా కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు.  అనంతరం కూన రవికుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తదితరులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.అక్కడ కూన రవికుమార్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిందేమి లేదని విమర్శించారు. అణగదొక్కడం, తప్పుడు కేసులు బనాయించడం, దాడులు చేయించడం, బీసీˆ రాజకీయ నేతలను హతమార్చడం తప్ప చేసిందేమైనా ఉందా అని ప్రశ్నించారు. తెదేపా పాలనలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామన్నారు. ఆ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ‘జయహో బీసీ’ సభ నిర్వహించారని విమర్శించారు. నాయకులు పీఎంజే బాబు, శింతు సుధాకర్‌, మాదారపు వెంకటేశ్‌, గొండు శంకరరావు, గొండు స్వాతి, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, శంకర్‌ పాల్గొన్నారు.

శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు, చిత్రంలో కూన రవికుమార్‌, తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని