చలిపులి
జిల్లాలో చలిపులి వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు.
జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
న్యూస్టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం), నరసన్నపేట
తామరాపల్లి వద్ద చలిమంట వేసుకున్న గ్రామస్థులు
జిల్లాలో చలిపులి వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి వేళల్లో చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. గత నెలతో పోల్చుకుంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గడం గమనార్హం. వారం రోజులుగా శీతల వాతావరణం ఎక్కువగా ఉంటుండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
పిల్లల విషయంలో జాగ్రత్త...
శీతాకాలం ప్రారంభం కావడంతో కొందరు న్యూమోనియా (ఉబ్బసం)తో బాధపడుతుంటారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఏడాది నుంచి ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని చిన్న పిల్లల ఓపీ విభాగానికి రోజుకు 80 మంది వస్తే అందులో 40 మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో 5 నుంచి 10 మంది వరకు న్యూమోనియాతో బాధపడుతున్నారని వివరిస్తున్నారు.
మరో నెలరోజులు ఇలాగే..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరో నెల రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగవచ్చు. తీరం వెంబడి 15 నుంచి 20కి.మీ వేగంతో గాలుల ప్రభావం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై కాస్త వాతావరణం వేడెక్కినా, శీతల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పొగమంచు ప్రభావం కొన్ని పంటలకు నష్టం వాటిల్లే అవకాశముంది.
- జె.జగన్నాథం, భూ విజ్ఞాన శాస్త్రవేత్త
వ్యాక్సిన్ తప్పనిసరి...
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగితే బాక్టీరియా వైరస్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువవుతుంది. ఇందుకు ముఖ్యంగా అయిదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా టీకా వేయించాలి. దీనికి అదనంగా పోషకాహారం, తల్లిపాలు అందించాలి. ఇవి క్రమం తప్పకుండా అందిస్తే న్యూమోనియా దరి చేరదు.
- డాక్టర్ మహేశ్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, జెమ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో