ధాన్యం కొనండయ్యా..!
జిల్లాలో 656 ఆర్బీకేల పరిధిలో 372 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు జిల్లాలో 8 మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టలేదు.
అన్నదాతను వణికిస్తున్న తుపాను
తామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉంచిన ధాన్యంపై పరదా కప్పి కాపలాగా ఉన్న రైతు
మాండోస్ తుపాను సిక్కోలు అన్నదాత గుండెల్లో అలజడి రేపుతోంది. రేయింబవళ్లు కష్టించి పండించిన పంట చేతికందే సమయాన ఈ విపత్తు ఆందోళన రేకెత్తిస్తోంది. రహదారులు, కల్లాల నుంచి కదలని ధాన్యపు రాశులు ఓ పక్క యంత్రాంగం ధోరణి మరోపక్క రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఓపక్క తుపాను తరుముతున్నా అధికారుల్లో స్పందన కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రయోగం వికటిస్తోంది. సాంకేతిక, సమన్వయ లోపాలు ఎక్కడికక్కడే వెక్కిరిస్తున్నాయి. దీంతో దేవుడిపై భారం వేసి విక్రయం కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు..
- న్యూస్టుడే, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, కలెక్టరేట్
జిల్లాలో 656 ఆర్బీకేల పరిధిలో 372 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు జిల్లాలో 8 మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టలేదు. కేవలం 152 చోట్ల మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 5,421 మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇదే సమయంలో సవాలక్ష సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అడపాదడపా పడుతున్న వర్షాలతో కర్షకులను కలచివేస్తోంది. పొలాల్లో వరికుప్పలను వేసేందుకు తంటాలు పడుతున్నారు. పరదాలను కప్పి భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ పంటను కొనేదెవరంటూ కలసినవారిని ప్రశ్నిస్తున్నారు.
తప్పని అవస్థలు..
ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు మెలికలు పెట్టడంతో రైతులపైనే భారం పడుతోంది. నరసన్నపేట మండలం చినకరగాం గ్రామానికి చెందిన గొండు అప్పారావు అనే రైతు ధాన్యం నూర్పిడి చేసిరెండు రోజులు గడిచినా తేమశాతం తేడాతో కొనలేదు. దీంతో ఆయన ర.భ రహదారిపై ఆరబెడుతున్నారు. ఎండలేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. పలువురు రైతులు తుపాను కారణంగా నూర్పులు వాయిదా వేసుకోగా, చేసినవారు ధాన్యాన్ని బస్సు షెల్టర్లు, గోదాములు, కళ్లాల్లో దాచుకుంటున్నారు. ఇక కళ్లాల్లోని ధాన్యం తరలించేందుకు రవాణా అగచాట్లు కూడా రైతుల మెడకే చుట్టుకుంటున్నాయి. రవాణా బాధ్యతలు దాదాపుగా రైతులే భరిస్తున్నారు. తూకపు యంత్రాల (వేబ్రిడ్జిలు) వద్దకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. ట్రాక్టర్లపై తరలించే ధాన్యం ఐదు టన్నులకు మించి తీసుకెళితే మళ్లీ రైతులు ఇంటికి తీసుకురావాల్సి వస్తోంది. 60 బస్తాలు మాత్రమే రైతులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియని కొందరు మిగిలిన బస్తాలను వెనక్కి తేవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడం గమనార్హం.
రైతులకు మేలు చేయాలన్నదే మా ఆలోచన...
గతేడాదితో పోల్చితే ఈసారి ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించాం. జిల్లాకు భారీ వర్ష సూచన లేదు. ప్ర స్తుతం చినుకులు పడుతున్నందున తేమశాతం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతుకు కొంత నష్టం వస్తుంది. సోమవారానికి వాతావరణ పరిస్థితులు కుదుటపడతాయి. ధాన్యం ఇచ్చేస్తామంటే తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగానే ఉన్నాం.
-మల్లారపు నవీన్, సంయుక్త కలెక్టర్
జలుమూరు మండలంలో ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్