2024లో జనసేన జెండా ఎగరాలి
జిల్లాలోని సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని, 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా కష్టపడాలని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం
మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్, వేదికపై పార్టీ నాయకులు
అరసవల్లి, న్యూస్టుడే: జిల్లాలోని సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని, 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా కష్టపడాలని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాలుగురోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని నియోజవర్గాల నాయకులతో సమీక్షలు నిర్వహించేందుకుగాను శుక్రవారం ఆయన శ్రీకాకుళం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరమైన విషయాలను, ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. విశాఖలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అనేక సమస్యలను కార్యకర్తలు దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. జిల్లాలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నట్లు వివరించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేవారని గుర్తిస్తామని హామీ ఇచ్చారు. 12న రణస్థలంలో జరిగే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. గ్లాస్ గుర్తుపై తప్పనిసరిగా ఓట్లు పడాలని సూచించారు. అ సందర్భంగా కొందరు కార్యకర్తలు తమ పార్టీకి సంబంధించిన సమాచారం తెలియడం లేదనే సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై వాట్సప్ గ్రూపులకు కేంద్ర కార్యాలయం నుంచి సంక్షిప్త సమాచారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా నాయకులు గేదెల చైతన్య, వెంకీ పట్నాయక్, ఉదయ్, విశ్వక్సేన్, కాంతిశ్రీ, రామ్మోహన్, కోరాడ సర్వేశ్వరరావు, సాయి, గురుప్రసాద్, బాబాజీ, సిద్ధయ్య, కిరణ్, ప్రవీణ్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.