ఉద్దానం వాసులంతా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి
ఉద్దానం ప్రాంతానికి చెందిన ప్రతి వ్యక్తి విధిగా కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా
శ్రీకాకుళం లీగల్ న్యూస్టుడే: ఉద్దానం ప్రాంతానికి చెందిన ప్రతి వ్యక్తి విధిగా కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా పీడిస్తోన్న సమస్య పరిష్కారానికి సామాజిక, మానవతా దృక్పథంతో కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. ఇప్పటివరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉద్దానంలోని నాలుగు మండలాల్లో మూడు వైద్య శిబిరాలు, మూడు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. వ్యాధిగ్రస్థులు మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మైనర్ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్తో మ్యాచ్పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్