అటవీ ఉత్పత్తుల సేకరణ ఏదీ..?
జిల్లాలో ఐటీడీఏ పరిధి పాతపట్నం గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) పరిధిలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పండించిన పంటలు, అటవీ ప్రాంతాల్లో సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి.
సవరజాడుపల్లిలో గిరిజనులు
- న్యూస్టుడే, మెళియాపుట్టి, పాతపట్నం
తయారుచేసిన కొండ చీపుర్లు
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.. నేలబొంతు కేంద్రంగా.. జీసీసీ కలెక్షన్ సెంటర్ ప్రారంభించాలి.. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు అందుతున్న సౌకర్యాలు, సేవలపై తెలుసుకునేందుకే వచ్చా.
గతేడాది మే 18న మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కంబం రవిబాబు అన్న మాటలివి..
జిల్లాలో ఐటీడీఏ పరిధి పాతపట్నం గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) పరిధిలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పండించిన పంటలు, అటవీ ప్రాంతాల్లో సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. అవసరమైన వారికి రుణ సదుపాయం కల్పించాలి. కాని జీసీసీ యంత్రాంగం ఉదాసీనత, సిబ్బంది కొరత వెరసి గ్రామాల్లో సేవలు కొరవడుతున్నాయి. దీంతో గ్రామాలకు చేరే వ్యాపారులు, దళారులనే గిరిజనులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నేలకొంది. దీంతో గిరిజన రైతుల ఆర్థిక స్వావలంబనకు తూట్లు పడుతున్నాయి. జీసీసీ పరిధిలో కంచిలి, మందస, మెళియాపుట్టి, పలాస, నందిగాం, టెక్కలి, పాతపట్నం, హిరమండలం, సారవకోట మండలాల పరిధిలో 32 గిరిజన (డీఆర్) డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో అటవీ ఉత్పత్తులు, రైతులు పండించే రాగులు, కొర్రలు, జొన్నలు, కందులు వంటి చిరుధాన్యాలు, జీడిపిక్కలు, ఫైనాపిల్, పసుపు, కొండ చీపుర్లు, నల్ల జీడి, నరమామిడి చెక్క, జిగురు వంటి అటవీ ఉత్పత్తులు కొనుగోళ్లు మొక్కుబడిగానే సాగుతున్నాయి. కానరాని జీసీసీ యంత్రాంగం: గిరిజన గ్రామాల్లో పండించిన పంటలు, సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయాలకు దళారులే శరణ్యంగా మారారు. పాతపట్నం, మెళియాపుట్టి, నందిగాం, మందస, తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులకు గిట్టుబాటు కల్పించి, ఆర్థిక ప్రోత్సాహం అందించాల్సి జీసీˆసీˆ యంత్రాంగం జాడ గ్రామాల్లో కానరావడం లేదు.
దళారులే కొంటున్నారు.. గతేడాది సుమారు 20 వేలకు పైగా కొండ చీపుర్లు, పైనాపిల్ పంట లారీ లోడు వరకు దళారులే కొన్నారు. ఇక జీడి, కుంకుళ్లు, ఇతరత్రా అటవీ ఉత్పత్తులను కూడా మా గ్రామాలకు వచ్చే వ్యాపారులకే విక్రయిస్తున్నాం.
సవర రాజు, సవరజాడుపల్లి
అవగాహన కల్పిస్తున్నాం.. జీసీˆసీ పాతపట్నం పరిధిలో ప్రణాళికాబద్ధంగా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఉన్న సిబ్బందితోనే ఊరూరా తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. పాతపట్నం జీసీసీ పరిధిలో 22 డిపోలు ఉన్నాయి. వాటి ద్వారా కొండ చీపుర్లు, కుంకుళ్లు, నరమామిడి చెక్క కొనుగోళ్లు చేస్తున్నాం. ధరలు కూడా ప్రకటించాం. కుంకుళ్లు కిలో రూ.45, నల్ల జీడి కిలో రూ.12, కొండ చీపుర్లు గ్రేడ్-1, రూ.45, గ్రేడ్-2 40, నరమామిడి చెక్క రూ.18 చొప్పున కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం.
నర్సింహులు, జీసీసీ నిర్వాహకులు, పాతపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం