ముంచుకొస్తున్న గడువు.. అన్నదాతల్లో గుబులు..!
ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఫిబ్రవరి 15 వరకే గడువు ఉందని ప్రకటిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గార మండలంలోని చాలా ప్రాంతాల్లో పొలాల్లోనే వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి.
తోణంగి వద్ద పొలాల్లోనే ఉన్న వరికుప్పలు
గార, న్యూస్టుడే: ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఫిబ్రవరి 15 వరకే గడువు ఉందని ప్రకటిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గార మండలంలోని చాలా ప్రాంతాల్లో పొలాల్లోనే వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్లో వరి పంట కోత సమయంలో అపరాలు పంట మినుము, పెసర విత్తనాలు రబీ పంటగా వేస్తారు. అప్పుడు వరి కంకులను కుప్పలుగా పొలాల్లోనే భద్రపరుచుకుంటారు. అపరాల సాగు చేతికొచ్చిన తర్వాత వరి కుప్పలను నూర్పిడి చేసి ధాన్యం విక్రయాలు జరుపుతారు. అయితే ధాన్యం కొనుగోలుపై అధికారులు గడువు విధించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు గానీ చాలాచోట్ల అపరాల సాగు చేతి అందే పరిస్థితి కనిపించడం లేదు. పంట పొలాల్లో ఉన్న వరికుప్పలు మార్చిలో గాని నూర్పిడి చేయలేరు. వమరవల్లి, తోణంగి, కొర్ని, కొర్లాం, జల్లువలస, సతివాడ, కె-సైరిగాం, బూరవల్లి, అంబళ్లవలస, పూసర్లపాడు, అంపోలు, శ్రీకూర్మం, వాడాడ గ్రామాల్లో ఎక్కువగా వరి కుప్పలు పంట పొలాల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆరుగాలం పండించే పంట దళారుల చేతికి చిక్కే రైతుకి నష్టం కలిగేందుకు అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని రైతులు కోరుతున్నారు.
స్పష్టమైన ఉత్తర్వులందలేదు...: మండలంలో సమస్య ఉన్నమాట వాస్తవమే. పొలాల్లోనే కుప్పలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్న యాప్లో రైతు వివరాలు నమోదు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై ఇంతవరకు స్పష్టమైన ఉత్తర్వులు అందలేదు.
పద్మావతి, ఏవో, గార మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.