మందకొడిగా ఈ-పంట నమోదు
జిల్లాలో ప్రస్తుత రబీలో ఈ-పంట నమోదు కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): జిల్లాలో ప్రస్తుత రబీలో ఈ-పంట నమోదు కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఈ-పంట నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని మండలాల్లో ప్రగతి తక్కువగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాల కారణంగా జాప్యం జరుగుతోంది. ఇంకా వరి, చెరకు, నువ్వు పంటలు నాటే దశలో ఉన్నాయి. ఈ నెలాఖరునాటికి ప్లాంటేషన్ పూర్తి కావచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రబీలో పెసర, మినప, మొక్కజొన్న, నువ్వు, వరి, వేరుశనగ పంటలను అధిక విస్తీర్ణంలో వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటన్నింటి వివరాలు తప్పనిసరిగా ఈ-పంటలో నమోదు చేయాలి. ఆ విషయంలో పది మండలాల్లో జిల్లా సగటు కంటే తక్కువగా నమోదైంది. 20 మండలాల్లో 80 శాతం నుంచి 152 శాతం వరకు నమోదు కాగా మిగిలిన మండలాల్లో 78 నుంచి 67 శాతం వరకు ఉంది. అత్యల్పంగా ఎచ్చెర్లలో 67.3 శాతం, సరుబుజ్జిలి 68.4, రణస్థలం 68.7, శ్రీకాకుళం 69.4, మిగిలిన మండలాల్లో 70 నుంచి 80 శాతంలోపు వివరాలు పొందుపరిచారు. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 152 శాతం, కవిటి 146.7, సారవకోట 102.2, పోలాకి 96.7, మందస 96.3, టెక్కలి 95.3, కోటబొమ్మాళి 91.8 శాతం నమోదైంది.
ఈలోగా పూర్తి చేస్తాం...
- కె.శ్రీధర్, జేడీ, వ్యవసాయశాఖ
ఈ-పంటలో వివరాల నమోదుకు వచ్చే నెల 20 వరకు గడువు ఉంది. ఇంకా కొన్ని పంటలు జనవరి నెలాఖరు వరకు వేస్తారు. పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పంట కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలి. గడువులోగా అన్ని ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా