logo

చైతన్య యాత్రను జయప్రదం చేయాలి

జిల్లాలో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార చైతన్యయాత్రను జయప్రదం చేయాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.రామప్ప పిలుపునిచ్చారు.

Published : 27 Jan 2023 04:55 IST

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార చైతన్యయాత్రను జయప్రదం చేయాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.రామప్ప పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఇల్లీసుపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు లింగాల గరికివాడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆర్‌.అప్పారావు, పిలక చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని