గణతంత్రం.. త్రివర్ణ శోభితం..!
జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం వాడవాడలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పార్టీ కార్యాలయాల్లో జరిగిన ఈ వేడుకల్లో వక్తలు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
జిల్లా కోర్టు వద్ద జెండాను ఎగురవేస్తున్నజిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా
జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం వాడవాడలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, పార్టీ కార్యాలయాల్లో జరిగిన ఈ వేడుకల్లో వక్తలు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా బార్ అసోసియేషన్ భవనం వద్ద ఆ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఫల్గుణరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్టుడే, బృందం
శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు..
ఆకట్టుకున్న ప్రదర్శన
ద్వితీయ బహుమతి పొందిన ఆర్డబ్ల్యూఎస్ శకటం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.