ఏళ్లు గడుస్తున్నా నిధులేవి?
పాడి పశువుల సంరక్షణకు గత ప్రభుత్వం ‘గోకులం’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాడిరైతులు తమ పశువులకు సరిపడేలా షెడ్లు నిర్మించుకునేందుకు పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
చినరావుపల్లిలో నిర్మించిన గోకులం షెడ్డు
న్యూస్టుడే, ఎచ్చెర్ల, రణస్థలం: పాడి పశువుల సంరక్షణకు గత ప్రభుత్వం ‘గోకులం’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాడిరైతులు తమ పశువులకు సరిపడేలా షెడ్లు నిర్మించుకునేందుకు పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వారు పదిశాతం భరిస్తే మిగిలిన 90 శాతం నిధులు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు ప్రకటించారు. పశువుల సంఖ్య ప్రాతిపదికగా ఒక్కో యూనిట్ రూ.1.50- 1.80 లక్షలుగా నిర్ణయించారు. దీంతో చాలామంది ముందుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది ఆర్థిక స్థోమతు లేక మధ్యలోనే నిలిపేశారు. ఈ పథకాన్ని 2018లో ప్రారంభించగా 2019 ఆగష్టు తరువాత నిర్మించిన వారికి ప్రభుత్వం 70 శాతం నిధులు మాత్రమే ఇస్తుందని రాయితీని తగ్గించారు. అప్పటికే నిర్మించిన వాటికి నిధులు విడుదల కాకపోగా మరోపక్క రాయితీ తగ్గించేయడంతో కొత్తగా ఎవరూ వీటి నిర్మాణాలకు ముందుకు రాలేదు. నేటికి మూడున్నరేళ్లు పూర్తయినా నిధులు అందకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పని ఎదురుచూపులు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో గోకులం పథకంలో భాగంగా 2441 షెడ్ల నిర్మాణానికి రూ.41 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో సగానికి పైగా పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉండిపోయాయి. పూర్తిచేసిన వారికి సుమారు రూ.3 కోట్లు వివిధ స్థాయిల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. వివిధ దశల్లో నిర్మాణాలు జరిగిన వాటికి ఇంకా రూ.30 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది.
నేటికీ నమోదు చేయని వైనం
ఈ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న షెడ్లకు పశుసంవర్థక శాఖ సాంకేతిక అధికారులు పరిశీలించి ఆన్లైన్లో ఎఫ్.టి.ఒ. (పెన్షన్ పేమెంట్ ఆర్డర్)లు నమోదు చేయాలి. నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. చాలామంది అప్పులు చేసి నిర్మించుకున్నారు. నిధుల విడుదల జాప్యంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలాల వారీగా మంజూరు ఇలా...
* ఎచ్చెర్ల 119, ఆమదాలవలస 107, భామిని 01, బూర్జ 19, జి.సిగడాం 37, గార 39, హిరమండలం 59, ఇచ్ఛాపురం 74, జలుమూరు 63, కంచిలి 29, కవిటి 88, కోటబొమ్మాళి 96, కొత్తూరు 20, లావేరు 243, ఎల్.ఎన్.పేట 109, మందస 25, మెళియాపుట్టి 39, నందిగాం 110, నరసన్నపేట 28, పాలకొండ 83, పలాస 15, పాతపట్నం 161, పోలాకి 61, పొందూరు 27, రాజాం 92, రణస్థలం 113, రేగిడి ఆమదాలవలస 33, సంతబొమ్మాళి 240, సంతకవిటి 53, సారవకోట 125, సరుబుజ్జిలి 109, సీతంపేట 01, సోంపేట 41, శ్రీకాకుళం 25, టెక్కలి 09, వజ్రపుకొత్తూరు 16, వంగర 47, వీరఘట్టం 49.
ప్రభుత్వం మెటీరియల్ కాంపొనెంట్ పనులకు సంబంధించి సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గోకులం పథకంలో పాడిరైతులు నిర్మించుకున్న షెడ్లకు నిధులు విడుదల చేయలేదు. మార్చినెల తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధుల చెల్లింపునకు అవసరమయ్యే చర్యలు చేపడతాం. సమస్యను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం.
కిశోర్, జిల్లా సంయుక్త సంచాలకులు, పశుసంవర్థకశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్