దివ్వరూపం.. నిత్య తేజం..!
ఆరోగ్యం భాస్కరాధిత్యాత్ అంటారు.. అంటే సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉంటుందని అర్థం. నిత్యం భానుడిని కొలిచేవారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
న్యూస్టుడే, అరసవల్లి
ఆరోగ్యం భాస్కరాధిత్యాత్ అంటారు.. అంటే సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉంటుందని అర్థం. నిత్యం భానుడిని కొలిచేవారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా మాఘమాసంలో అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుక నిర్వహిస్తారు. ముందురోజు అర్ధరాత్రి నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని ఉషాపద్మినీఛాయా సమేతుడైన సూర్యభగవానుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో జరిగే క్షీరాభిషేకాన్ని చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా ఆ తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో అరసవల్లి క్షేత్రం, ఆదిత్యుడి వైభవం, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి..
మంత్రముగ్దుల్ని చేసే అరుణశిల..
అరసవల్లి క్షేత్రంలో ఆరడుగుల ఎత్తు, సుమారు రెండున్నర అడుగుల వెడల్పుతో ఏకశిలతో స్వామి దివ్యరూపం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ అరుణశిలను చూసి వారు మంత్రముగ్దులవుతారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా శిలా శాసనాలు తెలియజేస్తున్నాయి.
పేరు వచ్చిందిలా..
ఈ క్షేత్రానికి వచ్చి పూజలు, అభిషేకాలు, సూర్యనమస్కారాలు చేస్తే కోర్కెలు ఫలించడంతో పాటు భక్తులు ఎంతో ఆనందంగా తమ ఇళ్లకు వెళ్తారని, అందుకే హర్షవల్లి అని నామం కలిగిందని ప్రతీతి. అనంతర కాలంలో అది అరసవల్లిగా రూపాంతరం చెందిందని పురాణాలు చెబుతున్నాయి.
ఏడాదిలో రెండుసార్లు కిరణస్పర్శ
ఏడాదిలో రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకేలా నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం గుండా తొలి కిరణాలు స్వామి పాదాల నుంచి మొదలై శిరస్సు వరకు వెళ్తాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏటా మార్చి 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.
వైజయంతి రథం: వైజయంతి రథం అంటే సప్త అశ్వాలతో కూడిన వాహనం. స్వామి దీనిపై నిల్చుని ఉంటారు. ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉంటాయి. స్వామి సామవేద ప్రియులు కావడంతో ఈ అశ్వాలను సరిగమపదని అనే సప్తస్వరాలుగా భావిస్తారు. ఈ రథం పది వేల యోజనాల పొడవు, పది వేల అడుగుల వెడల్పు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. రథానికి ఒక చక్రం, ఐదు ఆకులు, మూడు నాభులు, ఆరు చక్రపు అంచులుంటాయి.
12 మాసాలు.. 12 పేర్లు
తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందున స్వామిని ఆదిత్యుడని పిలుస్తారు. ఈయన ఎరుపు వర్ణం కలవాడు. రథంలో ఒకే చక్రం ఉంటుంది. దీన్ని సంవత్సరం అంటారు. ఈ రథంలో పన్నెండు మాసాలు, ఆరు రుతువులు, మూడునాభులు ఉంటాయి. ఇదే కాలచక్రమని కూడా అంటారు. అందుకే సూర్యభగవానుడిని పన్నెండు మాసాల్లో 12 పేర్ల (మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మారీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర)తో ఆరాధిస్తారు.
అన్నింటికీ ఆధారం సూర్యుడే..
ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.
ఆయురారోగ్యాలు పొందాలి...
సూర్యుడిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి ఆరోగ్యవంతులవుతారు. రథసప్తమి రోజున స్వామివారికి పాలాభిషేకం చేస్తాం. నల్లటి విగ్రహం మీద తెల్లని పాలు పడే దృశ్యం వీక్షిస్తే ఒళ్లు పులకరించిపోతుంది. ఆ దివ్యమూర్తిని దర్శించి అందరూ ఆయురారోగ్యాలు పొందాలి. ప్రతి నెలా మాససంక్రమణం రోజున కూడా క్షీరాభిషేకం చేసి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తున్నాం. - ఇప్పిలి నగేష్శర్మ, అర్చకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు
[ 23-04-2024]
ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
[ 23-04-2024]
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
[ 23-04-2024]
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. -
నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
[ 23-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. -
పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
[ 23-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. -
పలాసలో చుక్కలు చూపిన వైకాపా ర్యాలీ
[ 23-04-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు నామినేషన్ సందర్భంగా ప్రచార ఆర్భాటానికి చేపట్టిన ర్యాలీతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల వాసులు విలవిలలాడారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. కళ్లకు గంతలే..!
[ 23-04-2024]
రాష్ట్రంలో తీర ప్రాంతానికి ముఖద్వారంగా పేర్కొనే ఇచ్ఛాపురం మండలం డొంకూరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. -
కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
[ 23-04-2024]
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. -
నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. -
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
[ 23-04-2024]
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
77 మందికి షోకాజ్ నోటీసులు
[ 23-04-2024]
ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!