logo

‘వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయి’

వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయని, 2024 ఎన్నికలే అవకాశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 03:05 IST

మాట్లాడుతున్న గౌతు శిరీష, చిత్రంలో ఇతర నాయకులు

మందస, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయని, 2024 ఎన్నికలే అవకాశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు. మందస మండలం తాళ్లగురంటి పంచాయతీ గ్రామాల్లో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దకోష్టలో ఆ పంచాయతీ పరిధిలోని పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ అరాచకాలను గుర్తెరగాలని ప్రజలను కోరారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న   జనసందోహాన్ని చూసి సీఎంకు వణుకు పుట్టిందని, అందుకే అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల కోసం ఓర్పు, సహనంతో ఉన్నారన్నారు. పార్టీ మండల నాయకులు రుక్మిణీ బిశ్వాళ, రాజాన ఝాన్సీ, డి.తాతారావు, లింగరాజు, నవీన్‌, లచ్చయ్య, లక్ష్మణరావు, రుద్రయ్య, దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని