రాజమ్మ సంబరం.. చూసొద్దాం రండి..!
గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి(రాజమ్మ తల్లి) పీఠాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రానికే ఈ ప్రాంతానికి చేరుకుని పూజల్లో పాల్గొంటారు.
న్యూస్టుడే, గార
అమ్మవారి ఆలయం వద్ద భక్తులు (పాత చిత్రం)
గార మండలం వత్సవలస పంచాయతీ చిన వత్సవలసలో ఆధ్యాత్మిక సందడి మొదలుకానుంది. ఏటా మాఘమాసంలో ప్రారంభించి ఫాల్గుణమాసం వరకు నాలుగు వారాల పాటు రాజరాజేశ్వరి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. వరుసగా శని, ఆదివారాలు గ్రామంలోని అమ్మవారి ఆలయాలు, శక్తి పీఠాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నెల 4వ తేదీ నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవం విశిష్టత, సన్నద్ధతపై ‘న్యూస్టుడే’ కథనం...
గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి(రాజమ్మ తల్లి) పీఠాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రానికే ఈ ప్రాంతానికి చేరుకుని పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడే పరిసర జీడిమామిడి తోటల్లో పిల్లలు, కుటుంబసభ్యులతో రాత్రి తలదాచుకుంటారు. ఆదివారం వేకువజామున సమీపంలోని సముద్రంలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాజమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గొర్రెలు, మేకలు, కోళ్లు, నగదు, బియ్యం, బట్టలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తల్లిని కొలిచి తమ మొక్కులను దాసుడి(అమ్మవారిని కొలిచి పూజలు చేసేవారు) సమర్పించుకుంటారు. ఆ తరువాత అక్కడే వంటావార్పు చేసుకొని తిరుగుప్రయాణమవుతారు.
స్థల పురాణమిదీ..
పూసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి. బొబ్బిలి యుద్ధానికి ముందు అమ్మవారు విజయరామరాయలు కలలో బాలిక రూపంలో కనిపించి బొబ్బిలి సామ్రాజ్యం వేరే రాజ్యంలో కలిసిపోనుందని చెబుతుంది. తమను కాపాడలేని దేవతకు పూజలెందుకని భావించి అమ్మవారితో పాటు ఇతర దేవతల ప్రతి రూపాలను చెక్కపెట్టెలో ఉంచి సమీప నదిలో పడేస్తారు. ఆ చెక్కపెట్టె వత్సవలస సమీపంలోని మైలపల్లి వంశస్థులైన కొందరు జాలర్లుకు దొరుకుతుంది. పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు దాసుడు వివరించారు.
పకడ్బందీగా బందోబస్తు... రాజమ్మతల్లి జాతర సందర్భంగా ఈ ప్రాంతంలో మద్యం, సారా అమ్మకాలు విస్తృతంగా జరుగుతాయి. గతంలో వ్యాపార దుకాణాల్లో మద్యం విక్రయాలు బహిరంగంగానే జరిగేవి. కొన్నేళ్ల నుంచి అది గుట్టుగా సాగుతోంది. ఇప్పటికే పరిసర గ్రామాలైన అంపోలు, శ్రీకూర్మం, గార, కళింగపట్నం ప్రాంతాలు నుంచి మద్యం, శ్రీకూర్మం పరిసర ప్రాంతాలు నుంచి సారా చినవత్సవలస చేరుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు రాకపోకలు క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
సౌకర్యాలు శూన్యం...
వసతి సదుపాయం లేక ఆరుబయటే తలదాచుకోవాలిలా..
ఏటా ఫిబ్రవరిలో నాలుగు వారాల పాటు ఈ ప్రాంతానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తుంటారు. కానీ వారికి సరైన సౌకర్యాల్లేక ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మంచినీరు, మరుగుదొడ్డి సదుపాయం వంటి కనీస అవసరాలు కూడా ఉండవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థానిక సరుగుడు, జీడిమామిడి చెట్లు కిందే పందిళ్ల మాదిరి గుడారాలు ఏర్పాటు చేసుకుని భక్తులు రాత్రి నిద్రచేస్తారు. సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు..
గ్రామంలో మంచినీటి సమస్య దృష్ట్యా రెండున్నర లక్షలు వెచ్చించి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాం. బహిరంగ మద్యం విక్రయాలు కట్టడి చేశాం. ప్రస్తుతానికి 14 కుటుంబాలు మూడు వారాల పాటు ఈ జాతర నిర్వహిస్తాయి. మిగతా రోజుల్లో సాధారణ పూజలు జరుగుతాయి. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
శ్రీను, దాసుడు, చినవత్సవలస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM