యువకుడి బలవన్మరణం
గడ్డిమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పొందూరు మండలం లోలుగులో చోటుచేసుకుంది.
నాగరాజు (పాతచిత్రం)
పొందూరు, న్యూస్టుడే: గడ్డిమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పొందూరు మండలం లోలుగులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు గ్రామానికి చెందిన నూతబిల్లి సూర్యనారాయణ అలియాస్ నాగరాజు (26) భార్య శకుంతల గత ఏడాది డిసెంబరులో ఆత్మహత్యకు పాల్పడటం, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం గడ్డిమందు తాగడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతని తల్లి నీలమ్మ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణరావు చెప్పారు.
ఆర్టీసీ కాంప్లెక్స్లో వ్యక్తి మృతి
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో రణస్థలం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇ.రాంబాబు(45) గురువారం మృతిచెందాడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంబాబుకి మద్యం అలవాటుతో పాటు మూర్చవ్యాధి ఉంది. వేకువజాము 4 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని బెంచీపై కూర్చున్నాడు. 8 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆర్టీసీ స్టేషన్ మేనేజరు శామ్యూల్ గమనించి 108 వాహనంలో రిమ్స్కు తరలించే లోపు మృతిచెందాడు. ఇతనికి భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శామ్యూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు.
సోంపేట తహసీల్దార్పై లైంగిక వేధింపుల కేసు
సోంపేట, న్యూస్టుడే: సోంపేట తహసీల్దార్ ఎన్.రమేష్కుమార్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. స్థల సమస్యపై వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మొగళికొత్తూరుకు చెందిన మహిళ స్థల సమస్యపై కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేయగా తహసీల్దార్ను కలవమని ఆయన చెప్పారు. దీంతో డిసెంబరు 27న తహసీల్దార్ రమేష్ను కలిసి వినతిపత్రం అందజేయగా అప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్పై 354, 354-డి, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. జైభీమ్సేన జిల్లా అధ్యక్షుడు నగరి మోహన్రావు మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేయాలని, తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..