విదిలింపులే..!
సిక్కోలు వాసులకు కొత్త రైళ్లతో పాటుగా హాల్టుల ఊసే లేకుండా రైల్వే బడ్జెట్ కూత పెట్టేసింది. రైలు నిలయాల అభివృద్ధితో పాటుగా మూడోలైను నిర్మాణం, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణాలపై కేటాయింపులే కాస్త ఊరటనిచ్చే అంశం.
కొత్త రైళ్లు లేవు.. హాల్టులూ లేవు
మౌలిక సదుపాయాలకూ స్వల్ప కేటాయింపులే...
పలాస, న్యూస్టుడే
సిక్కోలు వాసులకు కొత్త రైళ్లతో పాటుగా హాల్టుల ఊసే లేకుండా రైల్వే బడ్జెట్ కూత పెట్టేసింది. రైలు నిలయాల అభివృద్ధితో పాటుగా మూడోలైను నిర్మాణం, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణాలపై కేటాయింపులే కాస్త ఊరటనిచ్చే అంశం. జిల్లా నుంచి వందల సంఖ్యలో వలసలు వెళుతున్నా రైల్వేశాఖ తరఫున జిల్లా నుంచి ఒక్క రైలూ కొత్తగా ప్రకటించకపోవటం, ఉన్న రైళ్లల్లో సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవటంతో జిల్లావాసుల ఆశలు అడియాసలయ్యాయి.
మూడోలైను పెండింగ్ పనులకు..
జిల్లా మీదుగా మూడో లైను ఏర్పాటులో పెండింగ్ పనులు పూర్తికి నిధులు కేటాయించింది. భద్రక్ నుంచి విజయనగరం వరకు 525 కిలోమీటర్ల మేర మూడోలైను పెండింగ్ పనులు పూర్తిచేయనున్నారు.
ఆ ఊసే లేదు..
జిల్లా మీదుగా నడిచేలా కొత్త రైళ్ల కోసం జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నా రైల్వేశాఖ కొత్త రైళ్ల ప్రతిపాదనలు, కేటాయింపులు ఇవ్వకపోవటంతో ఉన్న రైళ్లతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేందుకు నేరుగా రైళ్లు లేకపోవటంతో ఇటు ఒడిశాలోని కుర్దారోడ్, అటు విశాఖపట్నం వరకు వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం రైలు నిలయాలతో పాటుగా కంచిలి, నౌపడా, తిలారు, పొందూరు వంటి రైలు నిలయాల్లో రైళ్ల హాల్ట్ కోసం ప్రజాప్రతినిధులు విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకపోయింది.
పొడిగింపు..
జిల్లాలో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న నౌపడా-గుణుపూర్ బ్రాడ్గేజ్ లైను తెరువలీ వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించారు. గుణుపూర్ నుంచి 79.15 కిలోమీటర్ల దూరం ఉండే తెరువలి వరకు రూ.50 కోట్లతో బ్రాడ్గేజ్ లైను పొడిగించనున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా పలాస-విశాఖ-దువ్వాడ లైనుకు రూ.40 కోట్లు, వాల్తేరు డివిజన్లోని ఉద్యోగుల నివాస గృహాల మరమ్మతుకు రూ.15 లక్షలు కేటాయించారు.
పలాస రైలు నిలయంలో షెల్టర్లేని ప్లాట్ఫారం
వాల్తేరు డివిజన్కు రూ.2,857 కోట్లు..
తూర్పుకోస్తా జోన్ పరిధిలోని వాల్తేరు రైల్వే డివిజన్కు 2023-24 బడ్జెట్లో రూ.2857.85 కోట్లు కేటాయించారు. అత్యధికంగా వివిధ మార్గాల్లో డబ్లింగ్ పనుల కోసం రూ.2,185 కోట్లు, కొత్త రైల్వే మార్గాలకు రూ.285 కోట్లు, ట్రాక్ పునరుద్ధరణకు రూ.261.43 కోట్లు నిధులు ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాలకు రూ.292.79 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ.100 కోట్లు , సిగ్నల్, టెలికాంకు రూ.245 కోట్లు, విద్యుత్తు పనులకు రూ.236.45 కోట్లు, భద్రత సంబంధ పనులకు రూ.347 కోట్లు కేటాయించారు. రికార్డు స్థాయిలో వాల్తేరు డివిజన్కు కేంద్రం నిధులు విడుదల చేసిందని డీఆర్ఎం అనూప్ శత్పథి శుక్రవారం విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పైవంతెనలు.... సిగ్నలింగ్పైనే..
జిల్లాలో సుర్లారోడ్ నుంచి బాతువ రైలు నిలయం వరకు మార్గమధ్యలో ఉన్న పైవంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరించేందుకు, విజయనగరం, పలాస రైలు నిలయాల మధ్య రెండు ప్రాంతాల్లో ఐ.బి.సిగ్నల్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించింది. సుర్లారోడ్- ఇచ్ఛాపురం, సోంపేట-బారువ-మందస రైలు నిలయాల మధ్య ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు చేపట్టనున్నారు. పలాస-పూండి మధ్యలో రూ.2.05 కోట్లు, పొందూరు- సిగడాం మధ్యలో రూ.1.50 కోట్లతో రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రూ.3.71 కోట్లతో పలాస-పూండి, పూండి- నౌపడా, రూ.3.2 కోట్లతో కోటబొమ్మాళి- తిలారు, పలాస-పూండి, కోటబొమ్మాళి యార్డ్లో పరిమిత ఎత్తుతో కూడిన సబ్వేలు నిర్మించనున్నారు. రూ.2 కోట్లతో నౌపడా- కోటబొమ్మాళి సబ్వేతో కూడిన రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ.2కోట్లతో ఉర్లాం-శ్రీకాకుళం రోడ్ మధ్యలో రోడ్ ఓవర్బ్రిడ్జి చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.