అర్హత ఉన్నా పింఛను ఇవ్వరేం?
రెండున్నరేళ్లుగా పింఛను అందడం లేదని బూర్జ మండల పరిధి చీడివలసకు చెందిన దాసరి అప్పలసూరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచి శ్రీరామ్మూర్తిని నిలదీస్తున్న వృద్ధురాలు అప్పలసూరమ్మ
బూర్జ, న్యూస్టుడే: రెండున్నరేళ్లుగా పింఛను అందడం లేదని బూర్జ మండల పరిధి చీడివలసకు చెందిన దాసరి అప్పలసూరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లివలస గురుకులంలో శుక్రవారం గ్రామ సచివాలయ వాలంటీర్లు, కన్వీనర్లు, గ్రామ సారథుల శిక్షణ కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ ముందు సమస్య వివరించడానికి రాగా వారిని కలవకుండా ఇక్కడి నాయకులు అడ్డుకున్నారని ‘న్యూస్టుడే’ వద్ద ఆమె వాపోయారు. ‘గతంలో నా భర్త అప్పయ్యకు వృద్ధాప్య, నాకు దివ్యాంగ పింఛన్లు అందేవి. ఆయన రెండేళ్ల కిందట కన్నుమూశారు. కుమారులు కుటుంబ పోషణకు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఆరు నెలల పాటు మాకు పింఛన్లు అందాయి. ఆయన మృతి చెందిన అనంతరం సర్పంచి కారణంగా నాకు దివ్యాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లలో ఏ ఒక్కటీ అందడం లేదు. బతుకు భారమవడంతో సమీప గ్రామాల్లో చిన్నారుల ఆరోగ్యానికి ఉపయోగపడే వనమూలికలు, వేర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నా. సర్పంచిని ప్రశ్నిస్తే నా భర్త పేరిట అంత్యోదయ కార్డు ఉండటంతో పింఛను అందదని చెబుతున్నారు. నా భర్త బతికి ఉన్నప్పుడు ఇచ్చిన పింఛను ఇప్పుడు ఎందుకు అందడం లేదని’ కన్నీరుమున్నీరయ్యారు. వృద్ధురాలి ఆవేదనను గమనించిన ఎంపీపీ కె.దీప, మామిడివలస ఎంపీటీసీ సభ్యుడు జి.రాంబాబు అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ సంప్రదించగా ఆమెకు పింఛను అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి