ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణపతకం
ఖేలో ఇండియా పోటీల్లో సిక్కోలుకు చెందిన జూడో క్రీడాకారిణి కడపల సౌమ్య స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మధ్యప్రదేశ్లో శుక్రవారం జరిగిన రెండో ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్ కమ్ ర్యాంకింగ్ జూడో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొని విజేతగా నిలించింది.
కడపల సౌమ్య
శ్రీకాకుళం అర్బన్, న్యూస్టుడే: ఖేలో ఇండియా పోటీల్లో సిక్కోలుకు చెందిన జూడో క్రీడాకారిణి కడపల సౌమ్య స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మధ్యప్రదేశ్లో శుక్రవారం జరిగిన రెండో ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్ కమ్ ర్యాంకింగ్ జూడో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొని విజేతగా నిలించింది. తుది పోరులో కె.ఎం.హర్ష(కేరళ)ను చిత్తు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది దిల్లీలో జరిగిన మొదటి ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్ కమ్ ర్యాంకింగ్ జూడో పోటీల్లో సౌమ్య రజత పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని సెట్శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, డీఎస్ఏ ముఖ్య శిక్షకురాలు ఎం.మాధురీలత, జూడో సంఘ కార్యనిర్వర్వాహణ కార్యదర్శి పైడి సునీత, శిక్షకుడు పి.ఎస్.మణికుమార్, జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పులఖండం సూర్యప్రకాశ్, ఎం.వి.రమణ, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పెంకి సుందరరావు, జూడో సంఘ సభ్యులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?