అప్రమత్తంగా ఉందాం.. అడ్డుకుందాం..!
అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందుగానే ముప్పును పసిగట్టగలిగితే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో క్యాన్సర్ మొదటి వరుసలో ఉంటుంది.
- న్యూస్టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)
జెమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగంలోని రేడియేషన్ యంత్రం
అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందుగానే ముప్పును పసిగట్టగలిగితే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో క్యాన్సర్ మొదటి వరుసలో ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి.. ఇలా ఎన్నో కారణాలతో క్యాన్సర్ బాధితులు ఏటేటా పెరుగుతున్నారు. పురుషుల కంటే మహిళలను మరింతగా వేధిస్తోంది. రొమ్ము, గర్భాశయ ముఖ క్యాన్సర్లతో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. శనివారం ‘ప్రపంచ క్యాన్సర్ దినం’ సందర్భంగా జిల్లాలో ఈ వ్యాధి పరిస్థితి, అందుబాటులో వైద్యసదుపాయాలు, నిపుణుల సూచనలతో ‘న్యూస్టుడే’ కథనం..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య నిపుణుల లేరు. ఇక్కడ కేవలం నిర్ధారణ పరీక్ష(సూది మందు పరీక్ష) మాత్రమే చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే బాధితులను చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్కు పంపిస్తున్నారు. ప్రయివేట్ పరంగా చూస్తే శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ మెడికల్, సర్జికల్, రేడియేషన్ అంకాలజీ వైద్యనిపుణులు ఉన్నారు. క్యాన్సర్ బాధితులకు శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు.
మూడేళ్లలో 21,711 మందికి చికిత్స..
జిల్లాలో పొగాకు నమలడం, అడ్డపొగాకు పీల్చడం, మారిన జీవనశైలి తదితర కారణాలతో ఎక్కువ మంది క్యాన్సర్బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం, నెట్వర్కు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. మూడేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 21,771 మంది చికిత్స చేయించుకున్నట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్ పొగిరి ప్రకాశ్ తెలిపారు. చికిత్స అవసరమైన నేరుగా తెల్ల రేషన్ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెళ్తే వైద్యసేవలందిస్తారని, వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ప్రాథమిక దశలోనే గుర్తించాలి..
పొగాకుతో చేసే వస్తువుల వినియోగంతో శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిని వివిధ క్యాన్సర్లు వస్తున్నాయి. పొగ తాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి ప్రమాదం ఉంటుంది. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులతో తగ్గించవచ్చు. రెండు, మూడు దశలకు వెళ్లాక నిర్ధారణ జరిగితే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలి. ఎవరికైనా అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంప్రదించాలి.
డాక్టర్ సాయికిరణ్, సర్జికల్ అంకాలజిస్ట్, జెమ్స్ ఆసుపత్రి
వంశపారపర్యంగానూ రావొచ్చు..
ఇటీవల చాలా మందికి మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వకుండా పట్టుపాలు పడుతున్నారు. బిడ్డకు స్తన్యం ఇస్తే రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, యుక్తవయస్సుకు ముందే శృంగారంలో పాల్గొనడం వంటి కారణాలతో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వస్తుంది. దీనికి నివారించాలంటే యుక్తవయస్సు రాగానే తల్లిదండ్రులు ఆడపిల్లలకు ‘కెరోవాక్’ వ్యాక్సిన్ వేయిస్తే మంచిది.
డాక్టర్ దానేటి శ్రీధర్, సంతాన సాఫల్య వైద్యనిపుణులు, మెడికవర్ ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.